లక్షెట్టిపేట రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని లక్ష్మీపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందుల లింగన్న, సూరమల్ల రత్నయ్య, సూరమల్ల అంజయ్య, కందుల శరణయ్యలకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వినూత్న పథకాలు చేపట్టి దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ చేస్తున్న మంచి పనులను చూసి రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆకర్శితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కల్లు దావీదు, టీఆర్ఎస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగుల రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు అప్పని గురువయ్య, నాయకులు నాయకులు పెట్టెం రాజయ్య, ప్రకాష్, సింగిల్ విండో డైరెక్టర్ అప్పని లింగన్న గంగుల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.