ఆదిలాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై డీసీసీబీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్ శుక్రవారం ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జోగు రామన్న రాజేశ్వర్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సామల శంకర్, తదితరులు పల్గొన్నారు.