మారుతీనగర్/మెట్పల్లి రూరల్/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 26: ‘ఎంపీ అర్వింద్కు మ తాల పేరిట చిచ్చుపెట్టడం తప్ప ఏదీ చేతకా దు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేశానని ప్రగల్భాలు పలుకుతున్న డు. ఎక్కడ ఏర్పాటు చేశాడో చూపించాలి. గతంలో పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ పేరిట ఓట్లు దండుకున్నడు. ఇప్పుడు మోదీ, రాము డు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నడు’ అని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు.
శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, వేములకుర్తి, గోదూరు గ్రామాల్లో, రాత్రి మెట్పల్లి పట్టణంలోని బస్ డిపో, చావిడి చౌరస్తా, గోల్హనుమాన్, అయ్యప్ప దేవాలయంతోపాటు మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కల్వకుంట్లతో కలిసి ప్రచారం చేశారు. ఆయాచోట్ల మాట్లాడారు. అర్వింద్ ఎంపీగా గెలిచిన ఈ ఐదేండ్లలో ఒక్క పనీ చేయలేదని మండిపడ్డారు.
ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా..? ఆలోచించాలని సూచించారు. జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ఐదేండ్లలో చేసిన ప నులెంటో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఝూటా పార్టీలేనని, ఆ పార్టీల ను నమ్మి మోసపోవద్దని సూచించారు. తాను పనిచేసే వాడినని, తనకు అబద్ధాలు చెప్పడం చేతకాదని, పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను ఆశీర్వదిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు.