శ్రీరాంపూర్, జూలై 21: సింగరేణిలో అధికారులు, కార్మికుల ఉద్యోగ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచుతూ సీ ఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై కార్మికులు, వారి కుటుంబాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. బుధవారం శ్రీరాంపూర్ గనులు, ఓసీపీపై గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సంబురాలు నిర్వహించా రు. శ్రీరాంపూర్ ఆర్కే 6గనిపై టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వా మి, శ్రీరాంపూర్ ఓసీపీపై కేంద్ర ఉపాధ్యక్షుడు డీకొండ అన్న య్య, మంద మల్లారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి సంబురాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న వయోపరిమితినే సింగరేణిలో అమలు చేసేలా కృషి చేసిన టీబీజీకేఎస్ గౌరవా ధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, విప్ సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఓసీపీ పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, నాయకులు పోశెట్టి, అడ్డు శ్రీనివాస్, మాధవరెడ్డి, రాజయ్య, సంతోష్, ముత్యాల రమేశ్, బాలనర్సు, మణిందర్, నాయకులు గట్టయ్య, మల్లెత్తుల శ్రీనివాస్, సదయ్య, శంకర్, సందీప్, వినయ్ పాల్గొన్నారు.
కాసిపేట గనిపై..
కాసిపేట, జూలై 21: మందమర్రి ఏరియాలోని కాసిపేట 1వ గనిపై కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు సీఎం కేసీఆ ర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సం బురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. సమీపం లోని రామగుండంలో సింగరేణి మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం కార్మికులందరికీ మేలు చేస్తుందని టీబీజీకేఎస్ ఏ రియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ అన్నారు. వందేళ్ల చ రిత్ర కలిగిన జాతీయ సంఘాలు చేయలేని కార్మిక సంక్షేమ పథకాలు, హక్కులను టీబీజీకేఎస్ ద్వారా సీఎం కేసీఆర్తో సాధ్యమైందన్నారు. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షు డు బడికెల సంపత్, పిట్ కార్యదర్శి దుగుట శ్రీనివాస్, ఏరియా సహాయ కార్యదర్శులు మేడ సమ్మయ్య, బెల్లం అశో క్, బానోత్ తిరుపతి, బైరి శంకర్, దొమ్మటి రమేశ్, వెంకట రాజం, కరుణాకర్, బండి గణేశ్, సతీశ్, శిరీష్ పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో..
మందమర్రి రూరల్, జూలై 21: మందమర్రి ఏరియా వర్క్షాప్ వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ సింగరేణిలో హక్కుల సాధన టీబీజీకేఎస్తోనే సాధ్యమన్నారు. ఆయా గనులు, డిపార్టుమెంట్ల పిట్ కార్యదర్శులు బిల్లా మాధవరె డ్డి, యుగేంధర్, కొండాల్రావు, రాజన్న, జీడి బాబు, గాలిపెల్లి తిరుపతి, కార్మికులు పాల్గొన్నారు.
పెంపు అభినందనీయం..
బెల్లంపల్లిటౌన్, జూలై 21: సింగరేణి కార్మికులు, ఉ ద్యోగుల రిటైర్మెంట్ వయస్సు ఏడాది పెంచడం అభినందనీ యమని టీబీజీకేఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శాంతిఖని గని ఆవరణలో సీఎం కేసీఆర్కు బుధవారం కృ తజ్ఞత సభ ఏర్పాటు చేశారు. గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీ నివాస్ మాట్లాడుతూ కార్మికుల వారసులకు కూడా కారుణ్య ఉద్యోగాలు పొందడానికి ఒక ఏడాది కలసి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్, యూనియన్ గౌరవాధ్యక్షురాలు కవిత, అ ధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డికి ఈ సంద ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు రాజనాల రమే శ్, వెంకటరమణ, కొట్టే రమేశ్, గంటల అంజయ్య, చిలు ముల నర్సయ్య, పెద్దపల్లి రాజయ్య, చిలుక రాజనర్సు, దాడి రమేశ్, ప్రేమ్కుమార్, సూరం మల్లేశ్, ముత్తే కిష్టయ్య, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.