ప్రస్తుతం వరి పొట్ట దశ.. పక్షం రోజుల్లో కోత..
మద్దతు ధరకే సర్కారు కొనుగోలు
కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ఆదిలాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. నిరంతర ఉచిత కరంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తూ ఆసరాగా ఉంటున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు గతంలో మాదిరిగా స్థానికంగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాజాగా సీఎం కేసీఆర్ అధికారులను కూడా ఆదేశిం చారు. ఈ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో 2.12 లక్షల ఎకరాలు సాగవగా.. 3.95 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను 500 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రెండు సీజన్లలో పత్తి, వరి, కంది, సోయా, శనగ సాగు చేస్తారు. వానకాలంలో సాగు చేసిన పత్తి, కంది, సోయా ఉత్పత్తుల అమ్మకాలు ముగియగా.. యాసంగిలో సాగు చేసిన శనగ పంట సేకరణ జరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ప్రభు త్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయ డం, మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు, కాలువలకు మరమ్మతులు చేపట్టడం, ప్రాజెక్టులను ఆధునీకరించడం తో ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ ఏడాది 2.12 లక్షల ఎకరాల్లో రైతులు వరిని రెండో పంటగా వేశా రు. నీటి పారకం అధికంగా ఉన్న మంచిర్యాల జిల్లాలో 2.20 లక్షల ఎకరాలు, నిర్మల్లో 90 వేలు, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 13659, ఆదిలాబాద్లో 250 ఎకరాల్లో ప్రస్తుతం వరి సాగవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.95 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి మరో పక్షం రోజుల్లో కోతకు రానుంది. ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో ఆందోళన నెలకొనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊర్లలోనే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత మాదిరిగానే..
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది. గతేడాది కరోనా కారణంగా సర్కారు ఊర్లలోనే వడ్ల ను మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదుకావడంతో రైతులు ఇ బ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊర్లలోనే వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, ఇతర కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి పంటను సేకరించనున్నారు. ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 500 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పంటను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొనుగోలు తేదీలను ముందుగా ప్రకటిస్తామని, రైతులవద్ద నుంచి మద్దతు ధరతో పంటను కొం టామని అధికారులు తెలిపారు. వరి కోయగానే.. ధాన్యా న్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దని, ఆరబెట్టి, తాలు,తేమ లేకుండా చూడాలని, తేమ శాతం 17కు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతులు వడ్లను ఆరబోసి, తాలు, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. తేమ 17 శాతం మించకుండా చూడాలి.
సీఎం మా బాధలను అర్థం చేసుకుంటున్రు
నెన్నెల, మార్చి 30 : నాలుగెకరాల్లో వరి వేసిన. నాలుగైదేండ్లుగా రెండు పంటలు తీస్తున్న. వానకాలంలో సన్న రకం.. యాసంగిలో దొడ్డురకం సాగు చేస్తూ వస్తున్న. వడ్లు అమ్ముకోవడానికి ఇప్పటి వరకు ఎక్కడికి పోలే. దళారులు ప్రతిసారి ఇంటికొచ్చి తక్కువ ధరకు అడుగుతరు. ఓసారి అమ్మి మోసపోయిన. ఇగ అప్పటి నుంచి వాళ్లకు అమ్మడం లేదు. సర్కారోళ్లు పెట్టిన కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకుంటున్న. పైసా పోకుండా ఖాతాలో డబ్బులు వేస్తన్రు. మొన్నటి దాకా ఊర్లళ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టరని ప్రచారం చేసిన్రు. కానీ సీఎం కేసీఆర్ ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాలు ఉంటయని చెప్పిన్రు. లేకుంటే మాకు మస్తు తిప్పలయ్యేది.
దిగుబడి పెరిగింది..
మాది సోన్ మండలంలోని సాకెర గ్రామం. స్వర్ణవాగు పక్కనే మా పొలం ఉంటుంది. వాగుపై మూడేళ్ల క్రితం ప్రభు త్వం చెక్డ్యాం నిర్మించింది. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ను అందిస్తున్నది. నాకున్న మూడెకరాల పొలంలో వరి పంటను సాగు చేస్తున్న. ప్రస్తుతం పంటకు నీటి కొరత లేదు. పంట బాగా పెరిగి గొలక దశలో ఉంది. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే ఈసారి మంచి దిగుబడి వస్తదనుకుంటున్న. -కే హరీశ్, సాకెర
రైతులకు భరోసా ఏర్పడింది..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది రాలే. ఎప్పుడు వరి సాగు చేసినా, ప్రభు త్వం క్వింటాలుకు రూ. 1870 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నది. ప్రస్తుతం భూగర్భజలాలు పెరగడం, 24 గంటల ఉచిత కరంటు ఇస్తుండడంతో, యాసంగిలో కూడా మా గ్రామంలో వరి పంటను సాగు చేశాం. నాకున్న ఎకరం భూమిలో మొత్తం వరి సాగు చేసిన. 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తదనుకుంటున్న, గతంలో ఆరుతడి పంటలే వేసేటోన్ని. ఇప్పుడయితే నీళ్లు పుష్కలంగా ఉండడంతో వరిని నమ్ముకున్న.
ఇవి కూడా చుడండి
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్