మూడు రోజులు ఇండ్లలోనే ఉండాలని సర్పంచ్ పిలుపు
నిర్మానుష్యంగా రహదారులు.. దుకాణాలు బంద్..
గ్రామంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ
భైంసా టౌన్, ఏప్రిల్ 5 : మండలంలోని మహగాం గ్రామం లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నాలుగు రోజుల్లోనే 20 మందికి పాజిటివ్ రావడంతో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, సర్పంచ్ అప్పాల రాకేశ్, ఎంపీటీసీ పోశెట్టి కలిసి శనివారం సమావేశం నిర్వహించి సోమవారం నుంచి బుధవారం వరకు స్వచ్ఛందగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆదివారం నిత్యవసర సరుకులు తీసుకోవాలని సూచించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గ్రామస్తులు పెళ్లి వేడుకల కోసం మహారాష్ట్రకు వెళ్లివచ్చారు. వారు పరీక్షలు చేసుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీనికితోడూ ప్రజలు గుంపులుగా ఉండడంతో కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని మూడు రోజుల పాటు అందరూ ఇండ్లలోనే ఉండాలని నిర్ణయించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కు ధరించాలని సూచించారు. ఇండ్లలో శానిటైజర్ ఉపయోగించాలన్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
అప్రమత్తంగా ఉండాలి..
గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. గుంపు లు గుంపులుగా కూర్చోవద్దు. భౌతిక దూరం పాటించి వైరస్ నిర్మూలనకు సహకరించాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మాస్కు తప్పకుండా ధరించాలి. ఇంట్లో ఉంటేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మహగాం పీహెచ్సీ వైద్యుడు
ప్రజలు సహకరించాలి..
గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమ స్య తలెత్తితే వెంటనే దవాఖానకు వెళ్లి చికిత్స పొందాలి. వ్యాక్సిన్పై అపోహలు పెట్టుకోకుండా 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
-సర్పంచ్ అప్పాల రాకేశ్
స్వీయ నియంత్రణ పాటించాలి..
గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వీయ నిర్భందంలో ఉండాలి. పంచాయతీ కార్మికులతో ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. అందరూ సహకరిస్తేనే వ్యాప్తి తగ్గుతుంది.
-మసిడిగే సుధాకర్. గ్రామస్తుడు
ఇవి కూడా చదవండి
ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలి
భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూత
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి