వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని డీపీఓలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీపీఓలతో మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు.
జిల్లా పంచాయతీ అధికారుల పరిధిలోని పనులపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రవర్తించాలని, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి తెలిపారు.
గ్రామాలకు అవార్డులు వచ్చేలా తీర్చిదిద్దాలని, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు