రైతుబంధు పేరిట ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. సీజన్కు ముందే సిద్ధంగా ఉన్న ఎరువులు, విత్తనాల నేపథ్యంలో ప్రతి యేటా..పూర్తి భరోసాతో.. నిండైన నమ్మకంతో ఏరువాకకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పెరిగిన దిగుబడుల నేపథ్యంలో.. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరతో రైతులకు నష్టాలనేవే లేకుండా పో యాయి. సీజన్కు ముందే చేతిలో పుష్కలంగా ఉన్న డబ్బులతో.. అప్పుల వేట అవసరం లేకుండా పోయింది. వ్యా పారుల చుట్టూ తిరిగే పరిస్థితులు కూడా రావడంలేదు. తక్కువ వడ్డీకి బ్యాంకులు అప్పులు ఇస్తున్నప్పటికీ..అప్పు కోసం బ్యాంకుల గుమ్మం ఎక్కాల్సిన ఆవశ్యకత కూడా లేకుండాపోయింది. వర్షం పడిన మరుక్షణమే.. రైతు ధ్యా సం అంతా వ్యవసాయం పైనే!. పెట్టుబడుల బెంగలేకుండా ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో రైతన్నలు బిజీగా ఉంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయం అంటేనే వెనుకడుగు వేసే పరిస్థితులుండగా.. నేడు రైతు కుటుంబాలు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధ్దమవుతున్నారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి):వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి కొండంత భరోసాను ఇస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలంలోనే లక్షకు పైగా ఎకరా లకు పెరిగిన పంటల సాగు విస్తీర్ణం..మూడేండ్ల కాలంలో 12 లక్షలకుపైగా రైతులకు అందిన రూ.1,645కోట్ల పెట్టుబడి సా యం.. ఇటు వ్యవసాయంలోనూ.. అటు రైతుల జీవితాల్లో నూ పెనుమార్పులు తీసుకొచ్చాయనేందుకు అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. జిల్లాలో భూగర్భజలాలు సమృద్ధ్దిగా పెరిగి మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు జలకళతో కనువిం దు చేస్తున్నాయి. మూసీనది పరవళ్లు.. గతేడాది నుంచి అందు బాటులోకి వచ్చిన గోదావరి నీళ్లతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. 24 గంటల నిరంతర విద్యుత్తో పంటలు ఎం డిపోతాయన్న బెంగ తీరడంతోపాటు రైతు ఆత్మహత్య లేనేవే లేకుండా పోయాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం..
రైతులు ఇష్టంతో పంటలను సాగు చేస్తున్నారడానికి గత నాలుగేండ్ల కాలంలో జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణమే నిదర్శ నం. 2017-18 వానకాలంలో జిల్లాలో 3.44లక్షల ఎకరా ల్లోనే పంటలు సాగవుతుండగా.. 2020-21 వానకాలం నాటికి సాగు విస్తీర్ణం 4.38 లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే 2017-18 యాసంగిలో కేవలం 1.20 లక్షల్లోనే ఉన్న పం టల సాగు ఏకంగా 20 20-21 యాసంగి నాటికి 2.40 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుత వానకాలంలో 3,64,793 ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు.. ఉచిత విద్యుత్ వంటి పరిస్థితుల నేపథ్యంలో వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటు న్నాయి. సకాలంలో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిం చడంతోపాటు విత్తనాలు, ఎరువులను సమృద్ధ్దిగా అందు బాటులో ఉంచడం వంటి చర్యల ఫలితంగా ఒకప్పుడు ఎకరం లోనే సేద్యం చేసిన రైతులు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.
ప్రైవేట్ అప్పులకు స్వస్తి..
తొలకరి పలకరించగానే రైతులు బేలగా వడ్డీ వ్యాపారి వైపు చూడటం.. అడిగినంత వడ్డీకి ఒప్పుకుని అప్పు చేయడం ఇది ఒకప్పటి మాట. కానీ.. రైతుబంధు సాయం వచ్చాక రైతులకు పెట్టుబడి ఇబ్బందులనేవే ఉండడంలేదు. సంక్షోభ సమయంలోనూ రైతుకు అండగా నిలిచి సాయం అందిస్తూ వస్తున్నది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. గత మూడేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ పంటలను పండించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో బ్యాంకులు సైతం ఇతోధికంగా రుణాలను అందిస్తున్నాయి. గతేడాది వానకాలంలో జిల్లాలో రూ. 797.44కోట్లను రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకుని రూ.808.20 కోట్ల రుణాలను అంటే 101 శాతం మేర రైతులకు అందించాయి. ఈ ఏడాది రూ. 2,349.73 కోట్ల మేర పంట రుణాలను అందించేలా జిల్లాలోని బ్యాంకు లు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరగి దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడమేకాకుండా సకాలంలో చెల్లించి ప్రతి యేటా మనోధైర్యంతో పంటలసాగుకు ఉపక్రమిస్తుండటం శుభ పరిణామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పండుగలా వ్యవసాయం
రాజాపేట, జూన్ 26: ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యమిస్తుండటంతో పండుగలా వ్యవసాయం సాగుతున్నది. పం ట పెట్టుబడి కోసం ప్రభుత్వమే రైతుబంధు సాయాన్ని అందిస్తుండటంతో అప్పులు చేయాల్సిన అవసరం తప్పినది. పండించిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొని, రెండు, మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తుండటంతో రైతుల ఆర్థిక ఇబ్బందులు తీరాయి.
ప్రభుత్వ మేలును మరువలేను
చౌటుప్పల్ రూరల్, జూన్26: గతంలో పెట్టుబడి కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇచ్చిన రూ.35వేలతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా. సీఎం కేసీఆర్ సారు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి పూర్తిగా మారింది. రైతులు సంతోషంగా సాగు చేసుకుం టున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మేలును మరువలేను.
-మాదిరెడ్డి వెంకట్రెడ్డి, రైతు, దామెర గ్రామం
విత్తనాలు, ఎరువులు కొన్న..
బొమ్మలరామారం, జూన్26: నాకు 2.20 ఎకరాల భూమి ఉంది. గతంలో విద్యుత్ సరఫ రా సరిగ్గా లేక, భూగర్భజలాలు తక్కువగా ఉండటంతో పంటలు ఎండిపోవడంతో అప్పు లు మిగిలేవి. దీంతో ట్రాక్టర్పై కూలీగా పనిచేసేవాడిని. ఇప్పడు గోదావరి జలాలతో చెరువులు నిండటంతోపా టు, నిరంతర విద్యుత్ సరఫరాతో నాకున్న 2.20 ఎకరాల భూమి లో నాటువేస్తున్నా. ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద డబ్బు లివ్వడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా.
రైతుల పాలిట వరం..రైతుబంధు
భూదాన్పోచంపల్లి, 26: రైతుబంధు పథకం రైతుల పాలిట వరంగా మారింది. గతంలో సాగుకు పెట్టుబడి డబ్బుల్లేక బ్యాంకులు, వ్యా పారుల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చేది. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తుండటంతో ఆర్థిక ఇబ్బందు ల్లేవు. కేసీఆర్ రాష్ట్ర సీఎం కావడం రైతులకు వరంగా మారింది.
-కొమిరెల్లి మల్లారెడ్డి రైతు, ధర్మారెడ్డిపల్లి, భూదాన్పోచంపల్లి
పెట్టుబడుల తిప్పలు తప్పాయి
రామన్నపేట, జూన్26: ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు సాయంతో నాకు పెట్టుబడుల తిప్ప లు తప్పాయి. గతంలో పంటలు విక్రయించగా వచ్చిన డబ్బును వ్యాపారులకు కట్టేవాళ్లం. వచ్చే కొద్దిపాటి ఆదాయం వడ్డీలకే సరిపోయేది. తిరిగి పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు సాయంతో ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి తప్పినది.
-మెట్టు శ్రీనివాస్రెడ్డి, రైతు, ఎన్నారం, రామన్నపేట
గతంలో రైతులు వలస పోయిండ్రు
గుండాల, జూన్ 26 : నాడు వ్యవసాయం చేద్దామంటే సాగునీరు లేకుండే. ఎన్ని బోర్లు వేసినా రైతులు అప్పుల పాలు అయ్యేది తప్ప చుక్కనీరు పడేది కాదు. రైతులు వ్యవసాయం చేయలేక పట్టణాలకు వలస పోయిండ్రు. నేడు సీఎం కేసీఆర్ కృషితో గుండాల మండలానికి గోదావరి సాగు జలాలు రావడంతో భూగర్భజలాలు పెరి గాయి. 24 గంటల కరెంటుతో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ధాన్యం దిగుబడి పెరి గింది. నేడు రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో వ్యవసా యం పండుగ అయింది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించారు.
-అత్తి లక్ష్మీనారాయణ, రైతు, పాచిల్ల గ్రామం, గుండాల మండలం
రైతు నేడు రాజయ్యాడు
గుండాల, జూన్ 26: రైతుబంధు పథకంతో రైతులు పెట్టుబడులకో సం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే పరిస్థితి పోయింది. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు, రైతుబంధు డబ్బులు ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఆ డబ్బే పెట్టుబడికి, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతున్నది. నేడు సీఎం కేసీ ఆర్ చొరవతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నేడు రైతులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు వచ్చాయి. రైతు నేడు రాజయ్యాడు. -కుంచాల అంజిరెడ్డి, రైతు, గుండాల
రైతుబంధుతో రంది లేదు
ఆత్మకూరు(ఎం), జూన్26: రైతన్నల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులకోసం సాయం చేసేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుండటంతో రంది లేకుండా పోయింది. రైతుబంధు డబ్బులతో సకాలంలోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశా. -రచ్చ శంకర్, రైతు, ఆత్మకూరు(ఎం)
సాగుకు ఇబ్బందిలేదు
మోత్కూరు, జూన్ 26: సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పంటలను సాగుచేసుకునేందుకు ఇబ్బంది లేదు. ప్రభు త్వం పెట్టుబడి కోసం సాయం ఇస్తుండటం తో అప్పు లు చేయాల్సిన పరిస్థితి రైతులకు తప్పినది. పంటను ప్రభుత్వమే కొని, డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి. రైతులకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కొత్తపల్లి చంద్రయ్య, రైతు, మోత్కూరు
రైతుబంధుతో సాగు విస్తీర్ణం పెరిగింది
ఆత్మకూరు(ఎం), జూన్26: ప్రభు త్వం అందిస్తున్న రైతుబంధుతో ఆత్మకూరు(ఎం) క్లస్టర్లోని గ్రామా ల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. క్లస్టర్ పరిధిలోని ఆత్మకూరు(ఎం), సర్వేపల్లి, ధర్మపురం గ్రామాల పరిధిలో మొత్తం 8,945 ఎకరాల భూమి ఉంది. 2,441 మంది రైతులు పాస్ పుస్తకాలు కలిగి ఉం డగా రూ.3,71,25,632 రైతుబంధు డబ్బులు అందాయి. 2018లో ఆత్మకూరు(ఎం) క్లస్టర్ పరిధిలో 1,314 ఎకరా ల్లో వరి సాగు చేయగా 1,834 ఎకరాల్లో పత్తి, 2,88 ఎకరాల్లో కంది, 17 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేశారు. రైతుబంధు పథకం పూర్తి స్థాయిలో అందడంతో 2020-21లో క్లస్టర్ పరిధిలో 2,150 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2,270 ఎకరాల్లో పత్తి, 1,255 ఎకరాల్లో కంది, 50 ఎకరాల్లోఇతర పంటలు సాగు చేయగా రైతుబంధు 97 శాతం మంది రైతులకు అందుతుండడంతో సంతోషిస్తున్నారు.
-రాజశేఖర్, ఏఈవో, ఆత్మకూరు(ఎం)
వలిగొండలో 21,150 మంది రైతులకు లబ్ధి
వలిగొండ, జూన్26: మండలంలో 21,777 మంది రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోగా, 21, 150 మంది రైతుల బ్యాంకు ఖాతా ల్లో సుమారు రూ.30 కోట్ల పెట్టుబడి సాయం జమైంది. మండలంలో ఏదై న కారణంతో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అందని రైతులు మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి.
-అంజనీదేవి, మండల వ్యవసాయ అధికారి, వలిగొండ
16 వేల ఎకరాల్లో వరిసాగు
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 26 : యాదగిరిగుట్ట మండలంలో ప్రస్తుతం సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో మం డలంలో సుమారు 3,500 ఎకరాల్లో వరిని సాగుచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా సాయం అంది స్తుండటంతో గత రెండు నుంచి మూడేండ్లలో రెండు సీజన్లలో కలిపి సుమారు 16 వేల ఎకరాల వరకు వరి సాగు పెరిగింది.
అప్పుల బాధ తప్పింది
ఆత్మకూరు(ఎం), జూన్26: గతంలో రైతు లు ఎరువులు, విత్తనాలను వ్యాపారుల వద్ద అరువుకు తీసుకెళ్లి పంటలు పండి విక్రయించిన తర్వాత ఆ డబ్బులను ఇచ్చేవారు. రైతుబంధు సాయంతో రైతులు నగదు ఇచ్చి ఎరువులు, విత్త నాల ను కొంటున్నారు. అప్పుల బాధ తప్పింది.
-రామకృష్ణగౌడ్, ఎరువుల దుకాణం యజమాని