ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేశాడు. అతి తక్కువ సమయంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సమ్మర్లో మూవీ విడుదల అవుతుందని అందరు భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్తో వాయిదా పడింది.
క్రిష్- వైష్ణవ్ తేజ్ సినిమాకు సంబంధించి కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం నడుస్తుంది. రానున్న రోజులలో పెద్ద సినిమాలు విడుదల కానుండడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్ర బృందం చేస్తుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన క్రిష్ చిత్రాన్ని తప్పక థియేటర్ లో విడుదల చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇవికూడా చదవండి..