దస్తురాబాద్, సెప్టెంబర్19 : జలశక్తి అభియాన్లో భాగంగా నీటి సంరక్షణకు కృషి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్బాబు ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రోజూ 30 మంది కూలీలతో ఈజీఎస్ పనులు చేయించాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల 30 లోపు ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో క్రాంతి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్, ఈజీఎస్, పల్లె ప్రగతి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిషన్, ఏపీవో రవి ప్రసాద్, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వంద శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలి
గ్రామాల్లో వంద శాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్బాబు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని బుట్టాపూర్, మున్యాల, రాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో క్రాంతితో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో ఎంత మంది వస్తున్నారని అధికారులు, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు కొవిడ్ టీకాపై భయాందోళనకు గురి కాకుండా తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో అనిల్కుమార్, సర్పంచ్ దుర్గం శంకర్, ఆర్ఐ గంగన్న, ఏపీఎం గంగాధర్, హెచ్ఈవో వేణు గోపాల్, వీఆర్వో విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు సంతపూరి శ్రీనివాస్, దుర్గం రాజలింగం, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.