చెన్నూర్, మే 4: మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోషోకు శనివారం చెన్నూర్ పట్టణం నుంచి భారీగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి వెళ్లారు. కేసీఆర్ రోడ్షోకు తరలి వెళ్లిన వారిలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, దోమకొండ అనిల్, వేల్పుల సుధాకర్, జోడు శంకర్, జగన్నాథుల శ్రీను, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, కొండపర్తి వెంకటరాజం, పెండ్యాల లక్ష్మణ్, ఆరీఫ్, అయూబ్, మేడ సురేశ్రెడ్డి, కొప్పల రవీందర్, జడల మల్లేశ్, ఎనగందుల గోపి, రాసపాక శ్రీశైలం, నెన్నల భీమయ్య, నయాబ్, జడల వెంకన్న, గడ్డం విష్ణు, శ్రీనివాస్ ఉన్నారు.
కోటపల్లి, మే 4 : కోటపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రోడ్ షోకు తరలివెళ్లారు.
మందమర్రి, మే 4: మందమర్రి మున్సిపాలిటీ నుంచి అన్ని వార్డుల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. బైక్ల పై ర్యాలీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, సోషల్ మీడియా వారియర్స్తో పాటు కార్యకర్తలు, ప్రజలతో కలసి నినాదాలు చేస్తూ తరలివెళ్లారు.
రామకృష్ణాపూర్, మే 4: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల నుంచి సుమారు 4 వేల మంది ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లినట్లు నాయకులు తెలిపారు. తరలివెళ్లిన వారిలో పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, సీనియర్ నాయకుడు రాజా రమేశ్బాబు, వార్డు కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, గడ్డం సంపత్కుమార్, బోయినపెల్లి అనిల్రావు, నాయకులు రామిడికుమార్, అశనవేని సత్యనారాయణ, ఎల్లబెల్లి మూర్తి, సాంబార్ శేఖర్, లడ్డు రాకేశ్, గోవింద్, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు.
బెల్లంపల్లి, మే 4 : బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డుల నుంచి ప్రత్యేక వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. శాంతిఖని గని నుంచి టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, నాయకులు వెంకటరమణ, ఆవుల రవికిరణ్, లింగాల కిరణ్, వెంకటేశ్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు.
కాసిపేట, మే 4 : మంచిర్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు కాసిపేట మండలంలోని ఆయా గ్రామాల నుంచి బీఆర్ఎస్ గులాబీ దండు మంచిర్యాలకు తరలివెళ్లింది.
వేమనపల్లి, మే 4 : మండలం నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. తరలివెళ్లిన వారిలో సింగిల్విండో చైర్మన్ బిడె వెంకటేశం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.
శ్రీరాంపూర్, మే 4 : శ్రీరాంపూర్ కాలనీ నుంచి 50 బస్సుల్లో మంచిర్యాలకు కార్మికులు, ప్రజలు కేసీఆర్ సభకు తరలి వెల్లారు. తరలివెళ్లిన వారిలో నస్పూర్ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ ఏరియా ఇన్చార్జి పెట్టం లక్షణ్, కేంద్ర కమిటీ నాయకులు కే సురేందర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, కౌన్సిలర్ వంగ తిరుపతి, హైమద్, రఫీఖ్కాన్, గుంట జగ్గయ్య, ప్రవీణ్, బండి రమేశ్, పానగంటి సత్తయ్య, పొగాకు రమేశ్ పాల్గొన్నారు.