Rythu Bandhu |హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేకపోవడంతోనే రైతు బంధు డబ్బులు తిరిగి వెనక్కి వచ్చాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 1న నమస్తే తెలంగాణ పత్రికలో ‘రైతుబంధు రివర్స్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ స్పందించింది.
‘మూసేసిన బ్యాంకు ఖాతాలు, స్తంభించిన ఖాతాల కారణంగానే రైతుబంధు నిధులు తిరిగి వెనక్కి వచ్చాయి. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుం ది. కాబట్టి సరైన ఖాతా వివరాలను సేకరిస్తున్నాం. ఇది పూర్తికాగానే తిరిగి రైతుబంధు డబ్బులు జమచేస్తాం’ అని వ్యవసాయ శాఖ పేర్కొంది.