ఆసిఫాబాద్ టౌన్, మే 4 : బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకును భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్లోని మారెట్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు దుఖానాలు, హోటల్స్ ప్రాంతాల్లో కలియ తిరుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆత్రం సకును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆలిబిన్ అహ్మద్, నాయకులు రవీందర్, కార్తిక్, సాయిరాం, బలరాం నాయక్, ఇర్ఫాన్, నాయక్, వెంకన్న, అహ్మద్, ఇమ్రా న్, ఖలీల్, ఖాసీం, తదితరులున్నారు.
రెబ్బెన, మే 4 : ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మద్దతుగా మండలంలోని నంబాల, జక్కులపల్లి, గోలేటి గ్రామాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్రెడ్డి, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, పీఏసీఎస్ ఛైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావ్, మాజీ సర్పంచ్లు సుమలత, పేర పోశయ్య, భీమేశ్, నాయకులు మల్లయ్య, అజయ్జైస్వాల్, మల్లేశ్, విమలేశ్, దయాకర్, పంబాల శ్రీనివాస్, పరికిపండ్ల సత్యనారాయణ, లావుడ్య సుబ్బారావు, గణేశ్, శంకర్, కుమ్మరి మల్లేశ్, ప్రతాప్, వెంకట్రావ్, రవీందర్గౌడ్, మన్యం పద్మ, పర్వతాలు పాల్గొన్నారు.
బెజ్జూర్, మే 4 : మండలంలోని కుకుడా, అంబాగట్ గ్రామాల్లో జడ్పీటీసీ పంద్రం పుష్పలత ఆధ్వర్యంలో నాయకులు కరపత్రాలతో ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాయిని భాగ్య, బీఆర్ఎస్ నాయకులు సామల రాజన్న, రంగు సురేశ్ గౌడ్ పాల్గొన్నారు.