బెజ్జూర్, మే 4 : బెజ్జూర్ మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, నాయకులతో కలిసి పర్యటించారు. మర్తిడి గ్రామానికి చెందిన 30 మంది బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు ఆత్రం సక్కు గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, మాజీ ఎంపీటీసీ నాయిన భాగ్య, నాయకులు సామల రాజన్న, రాణా ప్రతాప్, తదితరులున్నారు.
కాగజ్నగర్, మే 4 : కాగజ్నగర్ డివిజన్లోని వివిధ మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 70 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి నియోజకవర్గ ఇన్చార్జి, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు