ఆదిలాబాద్ సరిహద్దుల్లో చెక్పోస్టులు
మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి థర్మల్స్క్రీనింగ్ టెస్ట్
నేటి నుంచి ప్రారంభం
ఆదిలాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండగా.. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఉండడంతో అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు చేపట్టారు. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అధికంగా రాకపోకలు సాగించే జైనథ్ మండలం డొల్లార వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఆరు రోజులుగా రోజుకు 250-300 కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 2,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,279 మంది హోం ఐసొలేషన్లో ఉండగా.. 23 మంది రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు నిత్యం 2 వేల వరకు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొందరికి ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తుండగా, మరికొందరిని హోం ఐసొలేషన్లో పెట్టి వారికి ఉచితంగా కరోనా కిట్స్ ఇస్తున్నారు. జిల్లాలో 29 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసి అర్హులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రజలు టీకా వేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించని వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
మహాముప్పునకు అడ్డుకట్ట
ఆదిలాబాద్ జిల్లాకు జైనథ్, బేల, తలమడుగు, బోథ్, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు సరిహద్దులో మహారాష్ట్రకు చెందిన గ్రామాలు ఉన్నాయి. జిల్లావాసులు మహారాష్ట్రకు, మహారాష్ట్రవాసులు జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్హెచ్-44తోపాటు ఇతర రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణాలు సాగుతా యి. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కరోనా కే సులు పెరుగుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పక్కరాష్ట్రం నుంచి వ చ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు బుధవారం జైనథ్ మండలం డొల్లార వద్ద చెక్పోస్టు ఏర్పా టు స్థలాన్ని పరిశీలించారు. స్క్రీనింగ్లో భా గంగా కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. మహారాష్ట్రకు చెందిన వారికి పాజిటివ్ వస్తే వారిని జిల్లాలో ప్రవేశించకుండా సొంత ప్రాంతాలకు తిరిగి పంపిస్తారు. మనరాష్ర్టానికి చెందిన వారికి వైరస్ సోకితే ఐసోలేషన్ కేంద్రాలకు పంపించి చికిత్సలు అందిస్తారు. జిల్లాలోని జైనథ్ మండలం డొల్లార, బేల మండలం శంకర్గూడ, తలమడుగు మండలం లక్ష్మీపూర్, బోథ్ మండలం ఘన్పూర్ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. చెక్పోస్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి వైద్య సిబ్బందిని నియమించామని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
చిరంజీవి అభిమానులకే ఎందుకు ఇలాంటి చేదు వార్తలు..?
హోంక్వారంటైన్ లో బాలీవుడ్ భామ..ఫొటో చక్కర్లు
ఎక్స్ట్రా రెమ్యునరేషన్ తో పూజాహెగ్డే రిపీట్..!