సుబేదారి, ఆగస్టు 6 : వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులు, 30వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు క బ్జాకు యత్నించగా, అడ్డుకున్న కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. దాడి విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోకపోవడం లేదని బాధిత కు టుంబం రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాం ప్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది.
సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్, సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. బాధితురాలు గండికోట రాజమ్మ కథనం ప్రకారం.. ‘30 ఏండ్ల క్రితం బాలసముద్రం అంబేద్కర్నగర్గుట్టకు సమీపంలో తమకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి, పట్టా ఇచ్చింది. ఇల్లు ని ర్మించుకొని, మున్సిపల్ నుంచి ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ తీసుకొని నివాసం ఉంటున్నాం. 30 డివిజన్ కాంగ్రెస్ నాయకులు బొంత సారంగపాణి, బొంత రాజు, వల్లెపు రమేశ్ మా ఇంటికి వచ్చే 12 ఫీట్ల రోడ్డును ఆక్రమించడానికి యత్నించగా, అడ్డుకోవడంతో మా కుటుంబం పై దాడిచేశారు. దీనిపై ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు, కలెక్టర్ గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేశాము’ అని బాధితురాలు రాజమ్మ వాపోయారు.