పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది. అల వైకుంఠపురంలో..తర్వాత మరో సినిమా చేయని త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చింది. మహేశ్బాబు ప్రాజెక్టును సెట్స్పైకి తీసుకెళ్లనున్నాడు త్రివిక్రమ్. మహేశ్బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు మే 31న ఈ మూవీ లాంఛ్ కానుంది.
ఈ ప్రాజెక్టులో పూజాహెగ్డేను హీరోయన్గా ఫైనల్ చేయాలని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో పూజాహెగ్డే అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో నటించింది. మహేశ్బాబుతో కూడా మహర్షిలో జోడీగా నటించింది. మహేశ్-పూజా-త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే పూజాకు త్రివిక్రమ్ అదనపు పారితోషికం ఇచ్చి మరి డేట్స్ ఓకే చేశాడని టాక్.