Gautama Buddha | ఒకనాడు గౌతమ బుద్ధుడి దగ్గరికి అయిదుగురు పండితులు వచ్చి తమ వివాదాన్ని పరిష్కరించమని కోరుతారు. వాళ్లలో ఒకరు ‘భగవంతుడు ఇలాంటివాడు, అలాంటివాడు, అతణ్ని పొందటానికి మార్గం ఇదని నా గ్రంథం అంటున్నద’ని చెబుతాడు. మరొకరు లేచి ‘అయ్యా! అది బొత్తిగా తప్పు. దేవుడు ఫలానా లక్షణాలు కలిగినవాడు. అతణ్ని సాక్షాత్కరించుకోవాలంటే మా గ్రంథం నిర్దేశించిన మార్గంలో పయనించాలి’ అంటాడు. ఇలా అందరూ వాళ్లకు నచ్చిన రీతిలో పరమాత్మను నిర్వచించారు.
అవన్నీ సావధానంగా ఆలకించిన తథాగతుడు ‘దేవుడు ఆగ్రహిస్తాడని, ఎవరినైనా ఎప్పుడైనా హింసిస్తాడని, అతడు స్వార్థపరుడని, అపవిత్రుడని, సంకుచిత స్వభావుడని మీ గ్రంథాలు చెబుతున్నాయా?’ అని ప్రశ్నిస్తాడు. అందరూ మూకుమ్మడిగా ‘లేదు స్వామీ! దేవుడు పరమ పవిత్రుడని, దయామయుడని, మంగళ స్వరూపుడని మా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి’ అని చెబుతారు. అప్పుడు సిద్ధార్థుడు గంభీర వదనంతో వారిని చూస్తూ ‘అయితే మీరు పరిశుద్ధులు, సాధుశీలురు అయితే సరిపోతుంది కదా! అప్పుడే మీరు భగవంతుడిని ఎలాంటివాడో అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకపోతే ఎంత వాదించినా ప్రయోజనం లేదు’ అని హితవు
పలుకుతాడు.
– మనోజ్ఞ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
ఎవరైనా మరణిస్తే పది రోజులు ఎందుకు మైల పాటించాలి.. ఇది ఆచారమా? మూఢ నమ్మకమా?
మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?