ramakrishna paramahamsa | ఓ సారి ఓ భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. తన ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసిన పూజల గురించి డాంబికాలు పలుకుతూ ఉంటాడు. పైగా అలాంటి భారీగా చేసే ఉపచారాలతో భగవంతుడు ప్రసన్నుడవుతాడని పక్క భక్తులతో ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అప్పుడు పరమహంస ‘పశుగ్రాసం, గానుగపిండి ఆవుకు రుచించే విధంగా భగవంతుడికి పేదల, దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది. సర్వేశ్వరుడు కోరుకునేది సరళతను, శుద్ధభక్తిని. రారాజు దుర్యోధనుడు తన సిరిసంపదల వైభవాన్ని చూపి, శ్రీకృష్ణుడిని తన మందిరానికి ఆహ్వానిస్తాడు. కానీ, వాసుదేవుడు సామాన్యుడైన విదురుడి ఆతిథ్యాన్నిస్వీకరిస్తాడు. భగవంతుడు భక్త వత్సలుడు. దూడ వెంట పరుగెత్తే ఆవులా భగవంతుడు భక్తుడి వెంటపడి పోతూ ఉంటాడు’ అని ఆ డాంబిక భక్తుడికి హితబోధ చేస్తాడు.
– మనోజ్ఞ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా