Foot care tips | ఈమధ్య పిల్లల్లో కూడా కాళ్ల పగుళ్లు కనిపిస్తున్నాయి. సాధారణంగానే శరీర బరువంతా కాళ్ల మీద పడుతుంది. గంటల తరబడి నిల్చున్నప్పుడు ఆ ఒత్తిడి మరింత అధికం అవుతుంది. కాళ్ల దగ్గర నూనె గ్రంథులు తక్కువైపోయి, చెమట ఎక్కువగా చేరడంవల్ల చర్మం పొడిబారిపోయి, పాదం గరుకుగా మారుతుంది. క్రమంగా పగుళ్లు పెరిగిపోయి, పొట్టు పోవడం మొదలవుతుంది.
ఇలాంటప్పుడు, కాళ్లను శుభ్రం చేసుకోవడానికి రసాయనాలు లేని సబ్బులు వాడాలి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికోసారి ఇంట్లో కొబ్బరినూనె, ఉప్పు కలిపి పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. రాత్రిళ్లు పావుగంటసేపు పాదాలను గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టి, తర్వాత కొబ్బరినూనె రాసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. అప్పుడప్పుడూ అరటిపండు, కలబంద గుజ్జుతో ప్యాక్ వేసి పావుగంట తర్వాత కడిగినా మంచి ఫలితాలు ఉంటాయి. వీటన్నిటితోపాటు ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. జింక్ ఎక్కువగా ఉండే చికెన్, పీతలు, కిడ్నీ బీన్స్, పెరుగు, బ్రౌన్రైస్ తినాలి. బీటా కెరోటిన్, విటమిన్-సి లభించే నారింజ, స్ట్రాబెర్రీ, అవిసె గింజలు, మొరంగడ్డ, టమాట కూడా తీసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Health tips : ఈ సూపర్ ఫుడ్తో కిడ్నీలు పదిలం!
చాయ్తోపాటు వీటిని తీసుకుంటే అనారోగ్యం తప్పదట..!
Spondylitis diet | రోజూ ఇవి తింటే స్పాండిలైటిస్ సమస్య రానే రాదు
వంటింట్లో ఉండే వీటిని కూరలతో తీసుకుంటే ఇంత మేలు జరుగుతుందా?