యుగధర్మాలను అనుసరించి పుణ్యం పొందే మార్గాలు మారుతూ ఉంటాయి. కృత యుగంలో తపస్సుతో పుణ్యం వచ్చేది. త్రేతాయుగంలో యజ్ఞ, యాగాదులు చేయడం ద్వారా పుణ్యం సంపాదించేవారు. ద్వాపర యుగంలో ‘ధర్మం’ పాటించడం ద్వారా పుణ్యాన్ని పొందేవారు. కౌరవులు ‘ధర్మాన్ని’ వదిలి పాపం మూటగట్టుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పాండవులు ‘ధర్మాన్ని’ విడిచిపెట్టలేదు. ఫలితంగా శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందారు. పుణ్యపురుషులు అయ్యారు.
కలియుగంలో పుణ్యం పొందే మార్గం దానధర్మాలు అని చెప్పారు పెద్దలు. తపస్సు ఆచరించడం ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే పనికాదు. యజ్ఞాలు నిర్వహించడమూ కష్టసాధ్యమే! ధర్మమార్గంలో పయనిస్తూ దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. పుణ్యం కోసం దానాలు చేయడం స్వార్థం అవుతుంది. నిస్వార్థంగా దానం చేయడం ఉత్తమ లక్షణం. పాపభీతితో దానాలు చేయడం, అక్రమార్జనలో కొంత వాటా విరాళంగా ప్రకటించడం వల్ల ఖాతాలో పుణ్యం పడుతుందనుకుంటే పొరపాటే! నిజాయతీగా సంపాదించిన దాంట్లో అవసరార్థులను ఆదుకోవాలి. అలాంటి దానాలే ధర్మబద్ధమైనవి. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టినా, దప్పికతో అలమటిస్తున్న వారికి గుక్కెడు మంచినీళ్లు పోసినా పుణ్యమే. దానగుణాన్ని తెలియజేసే కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. ఎవరి మెప్పు కోసమో దానాలు చేయలేదు వాళ్లు. అవసరాన్ని గుర్తించి తమ త్యాగనిరతిని చాటున్నారు. శిబి చక్రవర్తి, దధీచి మహర్షి వంటి దానశీలుర కథలను ఆదర్శంగా తీసుకొని అవసరార్థులను గుర్తించి యథాశక్తి ఆదుకుందాం.
– పసుపులేటి వెంకటేశ్వరరావు, 88857 97981
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?