ఆదిలాబాద్ జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్
జీపీ కార్యదర్శులు, సర్పంచ్లతో సమీక్ష
బేల, ఏప్రిల్ 17 : రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించారు. అర్హులందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగాఉండాలని, మహారాష్ట్ర ప్రాంతాల నుంచే వచ్చే ప్రజలకు పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్, 45 ఏండ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధు లు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు టెస్టులు చేసుకోవడానికి ముందు రావడం లేదన్నారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారు తప్పక కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి శంకర్రావు, ఎంపీడీవో రవీందర్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఇంద్రశేఖర్, సర్పంచులు విపిన్, వాడ్కర్ తేజ్రావు, నాయకులు మస్కే తేజ్రావు, మంగేశ్ ఠాక్రే, బండి సుదర్శన్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.