చౌటుప్పల్ రూరల్,జూన్ 30: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం మండలపరిషత్ కార్యాలయంలో నాలుగోవిడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాకేశ్రావు, మండల ప్రత్యేకాధికారి శ్రీ లక్ష్మి, మిషన్ భగీరథ డీఈ దిన్దయాళ్, వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు, జూన్ 30: పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతాయని జిల్లా బీసీ సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి యాదగిరి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పల్లె ప్రగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్రెడ్డి, ఎంపీఓ సురేందర్రెడ్డి ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సంస్థాన్నారాయణపురంలో..
సంస్థాన్ నారాయణపురం ,జూన్ 30: అధికారులు, ప్రజప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు సమన్వయంతో నాలుగో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో యాదగిరి అధ్యక్షతన పల్లెప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పది రోజుల పల్లెప్రగతి కార్యక్రమం మండల సూపర్వైజర్గా డీఈవో చైతన్యజైనిని, అదే విధంగా ప్రతి మూడు గ్రామపంచాయతీలకు కలిపి 31 గ్రామపంచాయితీలకుగాను 12మంది గ్రామ ప్రత్యేక అధికారులను నియమించారన్నారు. అసంపూర్తిగా ఉన్న డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం పనులను పూర్తిచేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య,ఆర్డబ్ల్యూఎస్ డీఈ దీన్దయాల్,ఎంపీవో శశికళ,ఏపీవో ప్రశాంతి,సర్పంలులు జైపాల్రెడ్డి,సుర్వీ యాదయ్య గౌడ్,జక్కర్తి పాపయ్య,పాండురంగానాయక్,కురిమిద్దె కళమ్మ,సత్యం,యదవరెడ్డి,పంచాయతీ కార్యదర్శులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫోటోరైటప్:30ఎస్ఎన్పిఆర్01 నారాయణపురంలో పల్లెప్రగతి పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూన్న ఎంపీడీవో యాదగిరి
పల్లె ప్రగతిపై అవగాహన
భువనగిరి అర్బన్, జూన్ 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు ప్రజా ప్రతినిదులు విజయవంతం చేయాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు బుధవారం పల్లెప్రగతిపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బీరుమల్లయ్య, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ నాగిరెడ్డి,తహసీల్దార్ శ్యామ్సుందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
బీబీనగర్లో…
బీబీనగర్, జూన్ 30 : గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ యర్కల సుదాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి రాజ్యం, ఎంపీడీఓ యు.శ్రీవాణి, ఎంపీఓ స్వాతి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లెప్రగతిపై సమావేశం
అడ్డగూడూరు, జూన్ 30 : జూలై 1వతేదీ నుంచి పది రోజుల పాటు గ్రామాల్లో నాలుగో విడుత పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని మండల ప్రత్యేకాధికారి కృష్ణ అన్నారు. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య, ఎంపీడీఓ చంద్రమౌళి పాల్గొన్నారు.