యాదాద్రి, ఏప్రిల్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీ పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చక బృందం బాలలాయంలో కవచమూర్తుల ను సువర్ణ పుష్పాలతో ఆర్చించి, వేదమంత్రాలతో అభిషే కించారు. తులసీదళాలు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా శ్రీమన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారిసన్నిధిలో ఉంచి అర్చన జరిపారు. సాయంత్రం బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహ రంగా అలంకరించి వేదమంత్ర పఠనాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించారు. ముత్తయిదువలు మంగళహారతుల తో అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాల యం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చే యించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మ వారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం సాగింది.
వైభవంగా నిత్యకల్యాణం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో లక్ష్మీనృసింహులను దివ్యమహోహరంగా అలకరించి తిరు నిత్యకల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా జరి పారు. మొదటగా సుదర్శన నారసింహ హోమం శాస్ర్తోక్తం గా నిర్వహించారు. స్వామి వారికి రోజువారీ నిత్యారాధన లు ఆగమశాస్త్ర రీతిలో వైభవంగా జరిగాయి. వేకువ జాము న సుప్రభాతంతో ఆరంభించిన నిత్యవిధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవ వేడుకలతో ముగిశాయి. మండపంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాల తో అర్పించారు. ఆలయంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చ నలు కొనసాగాయి. యాదాద్రి కొండ కింద తులసీవనం సమీపంలోని శిల్పారామంలో భక్తులు సత్యనారాయణ వ్రతమాచరించి కొండపైకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకు ని, మొక్కులు చెల్లించున్నారు.
4వ రోజుకు వసంత నవరాత్రి ఉత్సవాలు
లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయం శ్రీపర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి బాలాలయంలో సీతా రామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవా రం నాలుగోరోజుకు చేరాయి. పురోహితులు చర మూర్తుల కు నిత్యారాధనలు, రామమానస పూజ, ప్రాతఃకాల మ ధ్యాహ్నిక పూజలు శైవ సంప్రదాయ రీతిలో జరిపారు.
ఖజానాకు రూ. 4,20,798 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి రూ. 4,20,798 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 33,676, రూ. 100 దర్శనా లతో రూ. 7,600, క్యారీబ్యాగులతో రూ. 1,375, వ్రతాల తో రూ. 19,000, కల్యాణకట్టతో రూ. 13,400, ప్రసాద విక్రయాలతో రూ. 2,10,550, శాశ్వత పూజలతో రూ. 6,000, వాహన పూజలతో రూ. 9,200, టోల్గేట్ ద్వా రా రూ. 810, అన్నదాన విరాళంతో రూ. 150, సువర్ణ పుష్పార్చనతో రూ. 28,380, యాదరుషి నిలయంతో రూ. 39,400, శివాలయంతో రూ. 200, పాతగుట్టతో రూ. 4,840, టెంకాయ విక్రయాల ద్వారా రూ. 18,000, ఇతర విభాగాలతో రూ. 25,016 తో కలిపి స్వామివారికి రూ. 4,20,798 ఆదాయం సమకూరింది.