భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : కొవిడ్ సంక్షోభంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని అడిషనల్ డీసీపీ భుజంగరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని హౌజింగ్బోర్డు కమ్యూనిటీహాల్లో కొవిడ్ సమయంలో సేవలందిస్తున్న వైద్యసిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన డీఎంహెచ్వో సాంబశివరావు తో కలిసి పాల్గొని మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రజల ప్రా ణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం డీఎంహెచ్వో సాంబశివరావు మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లాను ముందు వరుసలో నిలిచేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అడిషనల్ డీసీపీ భుజంగరావు, డీఎంహెచ్వో సాంబశివరావులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదే విధంగా అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొందిన భుజంగరావును, డీఎంహెచ్వో సాంబశివరావులను ప్రమోద్కుమార్ సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటేశ్, నర్సింహ్మ, రేణుకాప్రదీప్, కోళ్ల గంగాదుర్గాభవాని, సామాజిక కార్యకర్త బాలేశ్వర్, దళిత ఐక్యవేదిక డివిజన్ నాయకుడు రామచంద్రయ్య, కృష్ణయాదవ్, అమానత్, నరేశ్, నితిన్, భూపాల్రెడ్డి, శ్యాం పాల్గొన్నారు.
మండలంలో 105 మందికి కరోనా టీకా
మోటకొండూర్, ఏప్రిల్ 27: మండల కేంద్రంలోని పీహెచ్సీలో 45 ఏండ్లు దాటిన 105 మందికి కొవిడ్ టీకాను వేసినట్లు మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ తెలిపా రు. అదే విధంగా పీహెచ్సీలో 33 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు.
ఆలేరు మండలంలో 37 మందికి పాజిటివ్
ఆలేరుటౌన్, ఏప్రిల్ 27 : ఆలేరు మండలంలో 37 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మొత్తం 106 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా 37 మందికి పాజిటివ్గా తేలిందని వైద్యులు తెలిపారు. అలాగే పట్టణంలో పారిశుధ్య సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
వలిగొండలో 25 మందికి కొవిడ్ ..
వలిగొండ, ఏప్రిల్ 27: మండలంలోని వర్కట్పల్లి. వలిగొండ, వేములకొండ పీహెచ్సీల్లో 144 మందికి కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్గా వచ్చిందని డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు.
కొవిడ్ పరీక్షల కేంద్రం ప్రారంభం
భువనగిరి టౌన్, ఏప్రిల్ 27 : పట్టణంలోని గంజ్ పాత మున్సిపల్ కార్యాలయంలో కొవిడ్ ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కొవిడ్ టీకా తీసుకోవాలి
బీబీనగర్, ఏప్రిల్ 27 : 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం నెమురగొములులో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆశ వర్కర్లను అభినందిస్తూ వారికి రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.