భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
బీబీనగర్, మే 22: కొవిడ్ కట్టడి కోసం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎయిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్లో ఆక్సిజన్ సరఫరాకు అవసరమయ్యే ఆక్సిజన్ ఫ్లో మీటర్లు అందుబాటులో లేకపోవడంతో స్పందించిన ఎమ్మెల్యే తన సొంత నిధులతో 30 ఆక్సిజన్ ఫ్లో మీటర్ల ను కొనుగోలు చేసి శనివారం ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ అనితారామచంద్రన్తో కలిసి ఎయిమ్స్ కొవిడ్ ఇన్చార్జి డాక్టర్ కళ్యాణికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రజలకు కొవిడ్ చికిత్స నిమిత్తం ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. కొవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.