ఆలేరు టౌన్, ఏప్రిల్ 14 :కొవిడ్ నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు కోరారు. ఆలేరులోని లయన్స్క్లబ్లో బుధవారం శారాజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో కొవిడ్ టీకా క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజాగ్రత్త వల్లనే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటైజర్ నియోగించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్వో సాంబశివరావును సన్మానించారు. లయన్స్క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభాకర్, కౌన్సిలర్ బేతి రాములు, ఏలె రాము, ప్రభుత్వ వైద్యాధికారి రాజేందర్, ఐడియా శ్రీనివాస్, సీస ప్రభాకర్, సముద్రాల ప్రభ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆలేరురూరల్, ఏప్రిల్14 : కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు అన్నారు. బుధవారం మండలంలోని కొలనుపాకలో శారాజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో శారాజీపేట పీహెచ్సీ వైద్యాధికారి రాజేందర్నాయక్, ఆశ నోడల్ అధికారి బెజవాడ పెద్దలక్ష్మి, వైద్య సిబ్బంది సురేశ్, సునీత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజాపేటలో…
రాజాపేట, ఏప్రిల్ 14: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు రఘునాథపురం, సింగారం గ్రామాల్లో బుధవారం 620 మందికి కరోనా టీకా వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గాడిపల్లి శ్రవన్కుమార్, కర్ల కరుణాకర్రెడ్డి, ఉపసర్పంచ్లు ప్రవీణ్, నర్సింహులు పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి, ఏప్రిల్ 14: 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని కొవిడ్ 19 జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పాపారావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మాదాపూర్, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం కొవిడ్ టీకా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయా కేంద్రాల్లో మొత్తం 614మందికి కరోనా టీకా వేశారు. అదే విధంగా మండల కేంద్రంలోని పీహెచ్సీలో 40మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు.
వ్యాక్సిన్పై అపోహలు వద్దు
మోటకొండూర్, ఏప్రిల్ 14: కరోనా వ్యాక్సిన్పై అపోహలు వద్దని మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మండల వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా గ్రామాల్లో 870 మందికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
కరోనా టీకా వేయించుకోవాలి
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్14: కరోనా వైరస్ నియంత్రణ కోసం 45 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని మండల వైద్యాధికారి ప్రణీష అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మండలంలోని పారుపల్లి, కఫ్రాయిపల్లి గ్రామాల్లో 630 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
బొమ్మలరామారం,ఏప్రిల్14:కరోనా రాకుండా గ్రామస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సోలిపేట సర్పంచ్ భూడిద నవీన్గౌడ్ అన్నారు. బుధవారం సోలీపేట నుంచి మండల కేంద్రానికి కొవిడ్ టీకా వేయించుకోవటానికి వెళ్తున్న 70మందికి ఆటో ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వ్యాక్సిన్ వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, ఎంపీడీవో సరిత, డాక్టర్ శ్రవణ్,సెక్రటరీ వెంకటరెడ్డి, ఆశ కార్యకర్త తిరుమల పాల్గొన్నారు.
1560 మందికి కరోనా టీకా…
భూదాన్పోచంపల్లి, ఏప్రిల్ 14: మండలం వ్యాప్తంగా 45 సంవత్సరాలు పైబడిన 1560 మందికి కరోనా టీకా వేసినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. అయితే బుధవారం 64 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని పిలాయిపల్లి, పెద్దగూడెం, జగత్పల్లి, గ్రామాల్లో టీకా వేసినట్లు ఆయన తెలిపారు.
కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ వేయించుకోవాలి
వలిగొండ, ఏప్రిల్ 14 : కరోనా కట్టడి కోసం 45 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డిస్ట్రిక్ ట్రైనింగ్ టీం వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ అన్నారు. బుధవారం మండలంలోని పులిగిల్ల ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు, పులిగిల్ల, పహిల్వాన్పూర్ గ్రామాల్లో 1150 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమలత, ఏపీఎంవో సంతోష్, సువర్ణకుమారి, అనురాధ, సుహాసిని, శ్రవన్కుమార్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో 8 మందికి కరోనా
మండలంలోని వలిగొండ, వర్కట్పల్లి. వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మండల వైద్యుడు డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా సంగెం, అరూరు, పులిగిల్ల, సుంకిశాల, వర్కట్పల్లి, దుప్పెల్లి, గోపరాజుపల్లి, వేములకొండ గ్రామాల్లో మొబైల్ క్యాంపుల ద్వారా 45 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.