ఆలేరురూరల్, జూలై 5 :నాల్గొవ విడుత పల్లె ప్రగతి పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో అభివృద్ధి పనులు జోరుగా నిర్వహిస్తున్నారు. మురు గు కాల్వలను శుభ్రపర్చడం, కంపచెట్లను తొలగించడం, అం తర్గత రహదారులను మరమ్మతు చేయిస్తున్నారు.అదేవిధంగా హరితహారం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై బాధ్య తగా మెలగాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యు లు, గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాలు పచ్చదనంతో మెరువాలి
బొమ్మలరామారం: పల్లె ప్రగతి పనులతో గ్రామాలన్నీ పచ్చద నంతో మెరువాలని ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి అన్నారు. మండలంలోని సోలీపేట, మునీరాబాద్, ప్యారారం, కంచల్ తండా గ్రామలలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు సోమవా రం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరిత, సర్పంచ్లు పూడూరి నవీన్ గౌడ్, శంకర్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం
తుర్కపల్లి: నాల్గొవ విడుత పల్లె ప్రగతిలో భాగంగా మండల కేంద్రంతో పాటు వేల్పుపల్లి, వాసాలమర్రి తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నా టడంతో పాటు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో మండల ప్రత్యేకాధికారి రెహమాన్, ఎంపీడీవో ఉ మాదేవి, ఏంపీవో శ్రీమాలిని, సర్పంచ్లు పోగుల ఆంజనేయు లు, పడాల వనితాశ్రీనివాస్, వాణిశ్రీ, ఎంపీటీసీలు పలుగుల నవీన్కుమార్, గిద్దె కరుణాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ట్రీగార్డులకు విరాళం
రాజాపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుధ్య పనులతో పాటు రోడ్లకు ఇరువైపులా మొ క్కలు నాటారు. మండలంలోని జాలలో టీఆర్ఎస్ నాయకు డు ప్రవీన్ 100 ట్రీగార్డుల కోసం రూ. 10 విరాళాన్ని అందజే సినట్లు సర్పంచ్ గుంటి మధుసూదన్రెడ్డి తెలిపారు. కార్యక్ర మంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
యాదగిరిగుట్ట రూరల్: పల్లెప్రగతి నాలుగో విడుతలో భాగం గా యాదగిరిగుట్ట మండలంలోని అన్ని గ్రామాలలో సోమవా రం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. మండలంలోని గౌ రాయపల్లి, మాసాయిపేట, చిన్నమాసాయిపేట గ్రామాలలో ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి పర్యటించి గ్రామాలలో ఏ ర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలను పరిశీలిం చారు. నాటిన ప్రతి మొక్కలను పర్యవేక్షించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని అన్నారు.
అందరూ భాగస్వామ్యం కావాలి
మోటకొండూర్: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో ప్రతి ఒక్క రూ భాగస్వామ్యం కావాలని ఎంపీడీవో వీరస్వామి అన్నారు. సోమవారం మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం ము మ్మరంగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి పరిమళాదేవి పరిశీలించారు. పలు అంగన్వాడీ కేంద్రాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్లు, గ్రామ ప్రత్యేకాధికా రులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాన్ని హరితవనంగా మార్చాలి
ఆత్మకూరు(ఎం): పల్లె ప్రగతిలో భాగంగా సోమవారం మం డల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ 6 రకాల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించి గ్రామాన్ని హరితవనంగా మా ర్చాలని సర్పంచ్ నగేశ్ ఈ సందర్భంగా గ్రామస్తులకు సూచిం చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయం బిల్ కలెక్టర్ సుదర్శన్, సిబ్బంది బాలరాజు, మాధవి పాల్గొన్నారు.