మార్కెట్కు అనుగుణంగాపంట వేసుకోవాలి
అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్ది
బీబీనగర్, జూన్ 3 : రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంతోపాటు, రాయరావుపేట గ్రామం లో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘం చైర్మన్, జడ్పీటీసీ ప్రణితాపింగళ్రెడ్డితో కలిసి రైతు వేదిక భవనాలను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం విశేషంగా కృషి చేస్తున్నదని, ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ వేదికల ద్వారా రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు అందరూ ఒకే చోట సమావేశమై వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రైతులు ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర లభిస్తుందో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీఏవో అనురాధ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, సర్పంచ్లు భాగ్యలక్ష్మీశ్రీనివాస్, సంతోషారమేశ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, చింతల సుదర్శన్, ఆకుల ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవో శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.