యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్కర్ఫ్యూ అమలు చేయనుంది.
ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ వేళల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఈఓ గీత తెలిపారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుండటంతో ఆలయాన్ని ఉదయం 5.30 గంటల తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తామని పేర్కొన్నారు.
ఆలయంలో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి