చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో అగ్నిప్రమాదం జరిగింది. మున్సిపాలిటీ కేంద్రంలోని అంజిరెడ్డి సినిమా టాకీస్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రేక్షకులను బయటికి పంపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలిపారు.
అయితే సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే అగ్నిప్రమాదం జరగడంతో ఆందోళనకు గురయ్యారు. కానీ, మంటలను త్వరగా ఆర్పివేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.