నీలగిరి, జూలై 8 : నల్లగొండ మున్సిపాలిటీని రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేస్తున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నల్లగొండ పట్టణంలోని 31, 35,36,37, 38,39,40,41,48 వార్డుల్లో ఎల్ఆర్ఎస్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రూ.వంద కోట్ల పనులు జరుగుతున్నాయని, మరో రూ.20 కోట్లు మంత్రి కేటీఆర్ విడుదల చేశారన్నారు. మర్రిగూడ బైపాస్ నుంచి బస్టాండ్ వరకు, ప్రభుత్వ దవాఖాన నుంచి కలెక్టరేట్, పానగల్ బైపాస్ నుంచి దేవరకొండ రోడ్డు, సాగర్రోడ్డు వరకు ఆరు, నాలుగు లైన్ల రోడ్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి , వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, కౌన్సిలర్లు కౌన్సిలర్లు ఖయ్యూంబేగ్, యామ కవితాదయాకర్, బండారు ప్రసాద్, బొజ్జ మల్లికానాగరాజు, బోయినపల్లి శ్రీనివాస్, జెర్రిపోతుల అశ్వినీభాస్కర్, ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, టీఆర్ఎస్ నాయకుడు సింగిరికొండ శివకుమార్, వీరమల్ల భాస్కర్, తుమ్మల గోవింద్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు రజిత, మంగా, సుశీల, శ్రీలక్ష్మి, రాజేశ్వరి పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించాలి
నల్లగొండ రూరల్ : గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలని డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి సూచించారు. గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. సర్పంచ్ రొమ్ముల నాగయ్య, జయమ్మ, సైదులు పాల్గొన్నారు.
తిప్పర్తిలో..
తిప్పర్తి : సర్వారం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్రెడ్డి, సర్పంచ్ పుల్లబట్ల ప్రవీణ్ కుమార్, ఎంపీఓ సంగీత, సూపరిం టెండెంట్ దయాకర్రెడ్డి పాల్గొన్నారు. సిలార్మియాగూడెంలో సర్పంచ్ యర్రమాద కవితానరేందర్రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో చింతకుంట్ల రవీందర్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, సైదులు, లింగయ్య పాల్గొన్నారు.
కట్టంగూర్లో..
కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, పరడ, కల్మెర గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనం, నర్సరీ, పారిశుధ్య పనులను మండల ప్రత్యేకాధికారి బాలశౌరి పరిశీలించి మొక్కలను నాటారు. మురుగు కాల్వలపై అక్రమ నిర్మాణాలను తొలగించి శుభ్రం చేయాలని సూచించారు. ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పొరెళ్ల సునీత, ఎంపీఓ అథర్ పర్వేజ్, ఏపీఓ గుంటుక వెంకటేశం, సర్పంచులు ఎంపీటీసీ సుంకరబోయిన వెంకన్న, వనం సైదమ్మాదుర్గయ్య, పుట్ట సుజనా వెంకట్రెడ్డి, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, మల్లెబోయిన శ్రీలతాకృష్ణ పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల: వట్టిమర్తి గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని, పారిశుధ్య పనులను మండల ప్రత్యేకాధికారి రాజ్కుమార్ ఎంపీడీఓలాజర్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుర్రి రవీందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఉప్పునూతల నర్సింహ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో..
నార్కట్పల్లి : నెమ్మానిలో మండల ప్రత్యేకాధికారి సుచరిత వీధుల వెంట ఉన్న చెత్తను ఎత్తించి, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాంబశివరావు, సర్పంచ్ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారంలో
శాలిగౌరారం : గురజాల గ్రామంలో పిచ్చి మొక్కలను సర్పంచ్ గుండా శ్రీనివాస్ తొలగించి శుభ్రం చేయించారు. అనంతరం మొక్క లు పంపిణీ చేశారు.
కేతేపల్లిలో..
కేతేపల్లి : గుడివాడ గ్రామంలో పల్లెప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి కాంతమ్మ పరిశీలించారు. అనంతరం సర్పంచ్ కట్ట శ్రవణ్కుమార్తో కలిసి మొక్కను నాటి నీళ్లు పెట్టారు. ఎంపీపీ శేఖర్, జడ్పీటీసీ బి.స్వర్ణలత, ఎంపీడీఓ భవాని, ఉపసర్పంచ్ ఆర్.సైదులుగౌడ్, ఏపీఓ కె.రామ్మోహన్ ఉన్నారు.
చండూరులో..
చండూరు : మండలకేంద్రంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. పలు వార్డుల్లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు తొలగించారు. కార్యక్రమాల్లో కమిషనర్ వెంకట్రామ్, కౌన్సిలర్లు కోడి వెంకన్న, తోకల వెంకన్న , మంచుకొండ కీర్తి, కొన్రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధిక పాల్గొన్నారు.
మర్రిగూడలో.
మర్రిగూడ : పల్లె ప్రకృతి వనాల్లో ఎప్పటికప్పుడు కలుపు తొలగించేలా చర్యలు తీసుకోవాలని దేవరకొండ డీఎల్పీఓ నర్సింహారావు సూచించారు. కమ్మగూడెంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. ఎంపీఓ ఝాన్సీరెడ్డి, సర్పంచ్ మార్నేని నిర్మల, ఎంపీటీసీ శిలువేరు విష్ణు, లూర్దయ్య పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు :మునుగోడు, సింగారం, ఊకొండి, గంగోరిగూడెం గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా మొక్కలు నా టించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ యాకూబ్ నాయక్, ఎంపీఓ సుమలత, ఏపీఓ శ్రీనయ్య, సర్పంచులు మిర్యాల వెంకన్న, గుర్రాల పరమేశ్, నడింపల్లి యాదగిరి, పారిజాత పాల్గొన్నారు.
నాంపల్లిలో
నాంపల్లి : మండలంలోని కేతేపల్లిలో సర్పంచ్ హేమలత గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు వెంట డోజర్తో కంపచెట్లను తొలగించారు. కార్యక్రమంలో కోరె యాదయ్య మహిళలు పాల్గొన్నారు.