యాదగిరిగుట్ట రూరల్, జూలై 27: ఉమ్మడి జిల్లాలోని సహ కార సంఘాలు బహుళార్థ సేవా సహకార సంఘాలుగా మార నున్నాయని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మ హేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట మండ లం వంగపల్లిలో పీఏసీఎస్ బోర్డు సమావేశంలో ఆయన మా ట్లాడారు. నాబార్డు సహకారంతో జిల్లాలోని అర్హత పొందిన సంఘాలకు రూ. రెండు కోట్ల వరకు రుణాలు అందించనున్నా రన్నారు. అదేవిధంగా ఈ స్కీం కింద అర్హత పొందిన సహకార సంఘాలు రుణాన్ని సక్రమంగా వినియోగించుకుని తిరిగి సకా లంలో చెల్లించి, వడ్డీ రాయితీని పొందాలని తెలిపారు. ఈ స్కీం కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల కు అవసరమైన సేవలు అందించవచ్చునన్నారు. దానిలో గో దాముల నిర్మాణం, రైస్ మిల్లు నిర్మాణం, పెట్రోల్ బంకుల ని ర్మాణం, పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వా రా వచ్చే ఆదాయం పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహ ణాధికారి మదన్ మోహన్, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ బిజి నెస్ డెవలప్మెంట్ అధికారి మణికాంత్, ఏజీఎం ఉదయశ్రీ, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, పాలవర్గం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
యాదాద్రి: నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉం టున్నదని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మ హేందర్రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణం గుండ్లపల్లికి చెం దిన ఉమా భవానీ అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందు తుండగా బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. లక్ష ఎల్వోసీ మంజూరైంది. కాగా అట్టి చెక్కును మంగళ వారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో గొంగిడి మ హేందర్రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో వెంకటాచారి, లింగం పాల్గొన్నారు.