వలిగొండ, జూలై22: మండలంలోని వలిగొండ, వేములకొండ, వర్కట్పల్లి, వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జోరుగా వైద్య ఆరో గ్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు కొవిడ్ టీకాను పంపిణీ చేశారు. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 600 మందికి, వేములకొండ పీహెచ్సీలో 460 మందికి, వర్కట్పల్లి పీహెచ్సీలో 470 మందికి, వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 220 మందికి కొవిడ్ టీకాను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా డాక్టర్ సుమన్కల్యాణ్ మాట్లాడుతూ గురువారం ఒక్క రోజే మండలంలో 1750 మందికి కొవిడ్ టీకా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు కిరణ్కుమార్, స్వామి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మోత్కూరులో 650 మందికి ..
మండలంలో గురువారం 650 మందికి వైద్య సిబ్బంది కొవిడ్ టీకా వేశారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో 244 మందికి, పాటిమట్లలో 126 మందికి, కొండగడపలో 80 మందికి, పాలడుగు, బుజిలాపురం గ్రామాల్లో 100 మందికి చొప్పున కొవిడ్ టీకాను అందించారు. కాగా పాలడుగులో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ మరిపెల్లి యాద య్య, ఎంపీటీసీ లక్ష్మణాచారి, ఏఎన్ఎం శైలజ, పార్వతమ్మ పాల్గొన్నారు.
రామన్నపేటలో 450 మందికి ..
మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో గురువారం 450 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు పలు గ్రామాల నుంచి ఉదయమే దవాఖానకు అధిక సంఖ్యలో రావడంతో రిజిస్ట్రేషన్ వద్ద తోపులాట జరిగింది. కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. మరికొంత మంది తిరిగి వారి ఇండ్లకు వెళ్లిపోయారు. సమాచారమందుతున్న పోలీసులు క్యూలై న్లు ఏర్పాటు చేసి అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకున్నారు.
అర్హులు రెండో డోసును సద్వినియోగం చేసుకోవాలి
కొవిడ్ రెండో డోసును అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. మండలంలోని బస్వాపురంలో గురువారం ఆమె కొవిడ్ రెండో డోసు టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో మొదటి డోసు తీసుకున్న అర్హులు రెండో డోసు టీకాను తీసుకోవాలన్నారు. టీకాపై ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. అదే విధంగా మండలంలోని వడపర్తి గ్రామంలో రెండు గ్రామాలకు సంబంధించిన టీకా పంపిణీ కార్యక్రమాన్ని వడపరి సర్పంచ్ కృష్ణారెడ్డి, మన్నెవారిపంపు సర్పంచ్ బోయిని పాం డు ప్రారంభించారు. మండలంలో గురువారం ఒకే రోజు 550 మందికి టీకా పంపిణీ చేసినట్లు మండల వైద్యాధికారి కిరణ్కుమార్ తెలిపారు.