బీబీనగర్,జూలై 23 : కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగి స్తున్న వారికి అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్న సీఎం కే సీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని సోము రమేశ్ కురు మ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చే స్తూ శుక్రవారం మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పర్వతం శ్రీశైలం యాదవ్, ఎర్రసాని మల్లేశ్ యాదవ్, గొల్ల గూడెం సర్పంచ్ రమేశ్ యాదవ్, సోమ గోపాల్ కురుమ, గూ దె శ్రీశైలం, పేరబోయిన లక్ష్మీనారాయణ యాదవ్, దవాడి స త్యనారాయణ, మైసయ్య, బీరప్ప, ఐలయ్య పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో
గొల్ల కురుమల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చేయూతను మరువలేమని టీఆర్ఎస్ పార్టీ మండ లాధ్యక్షుడు డేగల పాండరి అన్నారు. రెండో విడుత గొర్రెల పం పిణీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.ఆరు వేల కోట్లు కేటా యించి, ప్రతి యూనిట్ ధరను రూ.1,25,000 నుంచి రూ. 1,75,000 వేలకు పెంచినందుకు గాను మండల టీఆర్ఎస్ పార్టీ, గొర్రెల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవా రం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిటి పాముల రవీంద్ర, డైరెక్టర్ సూర్యనారాయణ, ఎంపీటీసీ నో ముల మల్లేశ్, యాదవ సంఘం అధ్యక్షుడు మర్రి వెంకటేశం, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఎమ్మె లక్ష్మ య్య, నరేశ్, ఇతాప నర్సింహా, రేఖ రాములు, మర్ల మల్లేశం, దేశబోయిన నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.