యాదగిరిగుట్ట రూరల్, జూలై 22 : తెలంగాణ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేం దర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటపేట గ్రామానికి చెందిన మేడబోయిన కొండయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు అయిన చెక్కు రూ. 60 వేలు ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గురువారం బాధితుడి కుటుం బ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి శ్రేయస్సే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు అందేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీ యమన్నారు. నేడు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉం టుందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.