‘కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక ఎవుసం ఎడారైంది.. కనీసం ఊళ్లె ఎవలన్న సచ్చిపోతే స్నానాలకు బోరు మోటరు పెడుదామన్నా కరెంటు ఇవ్వని దుస్థితి అప్పటిది.. రాత్రిపూట కరెంటు కోసం పొలాలకాడికిపోయి ఎంతమంది సచ్చిపోయిన్రో లెక్కేలేదు.. మళ్లీ అసోంటి రోజులు రావద్దు..’ అంటూ రైతులు, ప్రజలు తేల్చిచెబుతున్నారు. కాంగ్రెస్ అంటున్న మూడు గంటల కరెంటుతో కనీసం మూడు గుంటల భూమి కూడా పారదని, రైతులకు 24గంటల కరెంటు ఉంటేనే అన్నితీర్ల మేలుకలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ధరణితో ఒక్కొక్కటిగా భూ సమస్యలు పరిష్కారమవుతూ ఇప్పుడే మంచిగుంటున్నమని, మళ్లీ ఏదో తెచ్చి లేని పంచాయితీలు పెట్టొద్దని సూచిస్తున్నారు. ‘కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు’ అని నొక్కిచెబుతున్నారు.
కాంగ్రెస్ పాలన ఉంటే కరెంటు ఉండదని రైతులే కుండబద్దలు కొడుతున్నారు. ఆ పార్టీకి రైతుల మేలు పట్టదని, మళ్లీ దళారుల రాజ్యం తెచ్చి అన్నదాతలను ఆగంజెయ్యాలని చూస్తున్నరని విమర్శిస్తున్నారు. నాడు కరెంటు ఎప్పుడు వస్తదో? ఎప్పుడు పోతదో తెల్వక పనులన్నీ విడిచిపెట్టి పొలంకాడ ఉండేటోళ్లమని, రాత్రిపూట బిక్కుబిక్కుమనుకుంట కటిక చీకట్ల పొలాల కాడికి పోయేవాళ్లమని, ఇప్పుడా బాధలు లేవని చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు వ్యవసాయాన్ని ఎలా బాగు చేయాలో తెల్వదని, రైతులకు ఏంజేస్తే బాగుంటుందో వాళ్లకు తెల్వదని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల బాధలు తీర్చుతున్నాడని పేర్కొంటున్నారు. తమకు రైతుబంధు, 24గంటల కరెంటు, రైతుబీమా, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ మద్దతు అంటూ స్పష్టం చేస్తున్నారు. 3గంటల కరెంటు వ్యవసాయానికి ఎట్ల సరిపోతుందో రేవంత్ రెడ్డే ఎవుసం చేసి చూపించాలె అని నిలదీస్తున్నారు. మూడు గంటలే సరిపోతే నాడు కాంగ్రెస్ పాలనలో నాలుగైదు గంటల కరెంటు ఉన్నప్పుడు పొలాలకు నీళ్లు పారినయా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దిక్కూదివానం లేని మాటలు మాట్లాడి రైతులను ఆగంచెయ్యవద్దని, ఇప్పుడిప్పుడే మంచిగవుతున్న ఎవుసాన్ని మళ్లీ ముంచే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
నయీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ధరణి ప్రవేశపెట్టడంతో మా భూములకు ఎంతో సెక్యూరిటీ ఉంది. అటువంటి ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తుందని చెప్పడంతో మా భూములకు భద్రత ఉండదు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ధరణితో వచ్చే సమస్య ఏంటో ఏసీలో ఉండే వాళ్లు చెప్పడం కాదు, రైతులను అడిగితే తెలుస్తుంది. దీంతో ఎంత లాభమా, నష్టమా అని చెబుతారు. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైందికాదు. ధరణితో మా సమస్యలన్నీ తీరినయి.
నర్సంపేట రూరల్: కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులకు మళ్లీ కరెంటు బాధలు తప్పవు. రాత్రి పూట పంట పొలాలకు వెళ్లాల్సి వస్తుంది. మూడు గంటల కరెంటు ఇస్తే పొలాలు సరిగ్గా పండక అప్పులపాలవుతాం. కరెంటు సరిగా రాక పంటలు ఎండిపోతయి. మోటార్లు కాలిపోతయి. కాంగ్రెస్ రైతులను అయోమయంలో పడేస్తోంది. రైతులు 10హెచ్పీ మోటర్లు కొనలేరు. ఆ మోటర్లు ఉపయోగిస్తే ఇప్పుడున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయవు. మొత్తం అన్నీ మార్చడం సాధ్యం కాదు. అప్పుట్లో కరెంటు కోసం ధర్నా చేసినం. మల్ల పాత కష
నల్లబెల్లి: బుద్ధున్నోడు ఎవడైన మూడు గంటల కరెంటు ఇత్తామంటడా? కాంగ్రెసోళ్లకు రైతులంటే ఎన్నో ఏళ్ల నుంచి అలుసు. ఆ పార్టీ నాయకుల వల్ల గతంలో కరెంటు కట్టాలు పడ్డం. పంటలకు నీళ్లు పెట్టాలంటే నా భర్త, నేను రాత్రనక పగలనక అర్వకట్ట పడ్డం. చివరికి రెక్కలు ముక్కలు చేసుకుని ఎవసాయం చేసినా అప్పులోని మందం పండకపాయె. పోరగాళ్ల చదువులు, పెళ్లిళ్లు చేయాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డం. గిప్పుడు కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్ పెట్టాలంటే, అసలు ఎవుసం అంటే తెలుసా? 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే అందరి రైతులకు కరెంటు చాలుతదా? మోటర్ కాలిపోతే పైసలు యాడతెచ్చి అల్లియ్యాలె. అసలు ఈ మోటర్లు రైతులందరూ ఒక్కసారి ఆన్ చేస్తే కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా. సబ్స్టేషన్లు కాలిపోవా? గదేంది ఓట్ల పేరుతో మా నోట్లో మట్టి కొడుతారా ఏంది? గిట్ల మాట్లాడితే కాంగ్రెసోనికి ఎవడేత్తడు ఓటు. కేసీఆర్ సార్ దయతో 24గంటల కరెంటు వత్తాంది. మాటిమాటికీ కరెంటు టిప్పు అవుడు బందైంది. మోటర్లు కాలుడు లేదు. నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంటే సార్ నాకు ఏడాదికి రూ.35వేల పెట్టుబడి సాయం ఇత్తాండు. నా ఇద్దరు బిడ్డల పెండ్లికి ఒక్కరికి కల్యాణలక్ష్మి కింద రూ.లచ్చా 116 ఇచ్చి పెండ్లిళ్లకు సాయం చేసిండు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాకు సబ్సిడీ కింద 100 పీవీసి పైపులు, ఒక కరెంటు మోటర్ ఇప్పించిండు. పిండి బత్తాలు అదనకు దొరుకుతానై. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది. ఎస్సారెస్పీ కెనాల్ నీళ్లు వత్తానయి. మంచి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేత్తం. కేసీఆర్ సార్ రుణం తీర్చుకుంటం.
నెక్కొండ: కాంగ్రెస్ పార్టీకి అధికార యావ తప్ప రైతులకు చేసే మేలు ఏమీ లేదు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం రైతులు పడరానిపాట్లు పడ్డరు. చేతికొ చ్చే పంట కళ్లముందు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ హయాంలో ఏడెమినిది గంటల కరెంట్ ఇచ్చినా బావుల మోటర్లు, ట్రాన్స్ఫార్లరు తరచూ కాలిపోయేవి. ఇప్పుడు మూడు గంటల కరెంట్ ఇస్తమంటున్నరు. ఇంకెంత గోసపడాల్సి వస్తుందో రైతులు ఆలోచించు కోవాలి. సీఎం కేసీఆర్ ఇస్తున్న కాళేశ్వరం జలాలతో సాగునీటి తిప్పలు తప్పింది. వేసవిలోనూ చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతుండటంతో భూగర్భజలాలు పైకివచ్చాయి. బోర్లు, బావులతో రైతులు నేడు రెండు పంటలు సాగు చేస్తూ దర్జాగా బతుకుతున్నడు. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్, 10హెచ్పీ మోటర్లు అంటున్నరు. తెలంగాణ రైతన్నలను నిలువునా ముంచేందుకు కాంగ్రెస్కు నాయకులు రెడీ అయిపోతున్నారు. కాంగ్రె స్ నాటి కష్టాలు కొనితెచ్చుకోవద్దు. రైతులంతా బీఆర్ఎస్ను బలప రిచి సీఎం కేసీఆర్కు ఆశీర్వదించాలె. బీఆర్ఎస్ అధికా రంలోకి వస్తే రైతన్నలకు ఎలాంటి ఢోకా ఉండదు.
చెన్నారావుపేట: కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం చాలా కష్టాలు పడ్డాం. టార్చ్లైట్లతో రాత్రి పూట బావుల కాడికి పోయి కరెంట్ ఎప్పుడొస్తదా అని పడిగాపులు కాసేటోళ్లం. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలువక పోయేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్ ఇస్తున్నారు. మా బాధలు తీరాయి. ఇప్పుడు రాత్రి పూట పొలాల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. కరెంట్ సరిపడా ఇస్తుంటే పంటలు బాగా పండుతున్నయి. పండిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఆర్థికంగా కలిసి వస్తోంది. వ్యవసాయం పండుగలా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం గురించి తెలియని రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని చెప్పడం రైతులను అవమానించడమే. మూడు గంటల కరెంట్తో అర ఎకరం పొలం కూడా తడవదు. 10 హెచ్పీ మోటర్లను కొనుక్కొనే స్థితిలో రైతులెవరూ లేరు. గతంలో ఉన్న కష్టాలు, బాధలు మళ్లా తెచ్చే కాంగ్రెస్ మాకొద్దు. రైతులకు మేలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నాం.
హనుమకొండ సిటీ : 10 హెచ్పీ మోటర్ పెడితే భూగర్భజలాలు అడుగంటిపోతాయి. ప్రస్తుతం 2, 3 హెచ్పీ మోటర్ల ద్వారా పుషలంగా నీళ్లు పారిచ్చుకుంటున్నం. ప్రస్తుతం రైతులం సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్రు. రైతుల ద్వారా రాజకీయాలు చేసి వారి జీవితాలతో అడుకుంటే ఓట్లతో బుద్ధి చెప్తం. 24 గంటల కరెంటు సరఫరా ద్వారా రాత్రి పొలాల దగ్గరికి వెళ్లడం బంద్ చేసి, విష సర్పాల కాటు నుంచి బయటపడ్డాం. మళ్లీ పాత కష్టాలు కొనితెచ్చుకోం. రైతులను ఆదుకున్న వారికే ఓటు వేసి గెలిపిస్తం.
నర్సంపేట రూరల్, నవంబర్ 26: గతంలో భూమి హక్కులకు సంబంధించి అనేక రికార్డులు ఉండేవి. ఏండ్ల కొద్ది భూమి రికార్డులు సరిగ్గా లేక ఆఫీసుల చుట్టూ తిరిగి ఆగమయ్యాం. ప్రస్తుతం రైతుల భూములకు ధరణితో భద్రత కలిగింది. గతంలో ఎవరి అనుమతి లేకుండానే ఒకరి భూమిని మరొకరికి అధికారులు ఇష్టారాజ్యంగా మార్చేశారు. ధరణి వచ్చాకే రైతుబంధు, రైతుబీమా వచ్చింది. ఈ పథకాలు రైతాంగానికి ఎంతో అండగా నిలుస్తున్నాయి. ధరణి పోర్టల్ తెచ్చి సీఎం కేసీఆర్ రైతుల బాధలు తీర్చాడు. అప్పట్ల అమ్ముదామన్నా, కొందామన్నా చాన తిప్పలయ్యేది. రెవిన్యూవోళ్లు పైసలు తీసుకున్నా పనిచేసేటోళ్లు కాదు. సీఎం కేసీఆర్ వచ్చినంక ధరణి పెట్టి మంచి పనిచేసిండు. దీంతో మా భూముల పట్టాలు సులువుగా వచ్చినయి.
నల్లబెల్లి: ధరణి తీసేత్తామన్న కాంగ్రెసోన్ని రైతులంతా తరుముడే. కాంగ్రెస్ పాలనలో ఎన్నో బాధలు పడ్డం. తహసీల్దార్ ఆఫీసుల్లో ఒకరి భూమి ఇంకొకరికి రాసేటోళ్లు. భూముల సమస్యలపై గ్రామాల్లో చాలామంది దాడులు చేసుకొని కేసుల పాలయ్యేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సార్ కేసీఆర్ పేదల గోసను అర్థం చేసుకుని ధరణి తీసుకువచ్చిండు. లంచాలు లేకుండా 10 నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ అవుతున్నయి. భూములకు భద్రత వచ్చింది. సెల్ ఫోన్లో భూముల సంగతి తెలుసుకుంటానం. అప్పట్లో పంటలకు సరిపడ నీళ్లు పెట్టలేకపోయేవాళ్లం. కేసీఆర్ దయతో మంచిగా పంటలకు నీళ్లు పారిత్తానం. పంటలు మంచిగ పండుతానై. భూములకు లచ్చల్లో ధరలు పెరిగినై. కొద్దిగా మా ముఖాలు తెల్లబడ్డయి. నాలుగు పైసలు ఎనకేసుకుంటానం. వానలు పడి నష్టం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ ఆదుకోకపాయె. రైతు అప్పుల పాలై సత్తే ఏనాడైనా కుటుంబాలను ఆదుకున్నరా? ధరణి తీసేత్తమంటే చూసుకుంట ఉంటమా? గట్టిగా బుద్ధి చెప్తం. ప్రజల బతుకులు బాగు చేసిన బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటాం.
ఎల్కతుర్తి: ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్య మే నడుస్తది. రైతులు అరిగోస పడాల్సిందే. రైతుల మధ్య రోజు పంచాయతీలు అయిత యి. పట్టా భూములకు కూడా భద్రత ఉండని పరిస్థితి వస్తది. గతంలో భూముల రిజిష్ర్టేషన్, మ్యుటేషన్ కోసం పడరాని తిప్పలు పడ్డాం. పైసల కోసం మ్యుటేషన్ చేయకుండా అధికారులు చెప్పులు అరిగేలా తిప్పుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇంకా కౌలు చట్టం తెస్తే కౌలుకు ఇచ్చిన రైతుల ఉన్న భూమిని కౌలు కాలమ్లో వారి పేరు రాస్తే వారు తిరగపడకుండా ఉంటారా. ఎన్నేండ్లు అని కౌలు పేరు రాస్తారు. కౌలుకు ఏడాదికి ఒకే రైతుకు ఇస్తామా? వేర్వేరుగా ఇస్తే ఎన్ని పేర్లు అలా మారుస్తారు. ఇలాంటి విధానాలతో వచ్చే వారి గురించి రైతులు ఆలోచించాలి.
నెక్కొండ: ధరణి తీసేస్తే రైతులకు అన్నీ కష్టాల ఎదురైతయి. సీఎం కేసీఆర్ ఎంతో మంచిగా ఆలోచించి రైతుల కష్టాలను తొలగించేందుకు ధరణి తెచ్చిండు. ధరణిలో రైతుల యాజమాన్య హక్కులను మార్చడం ఎవరితరం కాదు. అది తీసేస్తే మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థలా మారిపో తది. నాయకులు చెప్పితే, లంచాలు ఇస్తే ఒకరి భూమి మరొకరి పేరు మీద చేయడం కాంగ్రెస్ హయాంలో జరిగేది. కౌలు రైతుల కాలమ్ పెడితే కౌలు రైతులు పట్టాదారు భూమిని వారిపరం చేసు కుంటరు. రైతుబంధు, రైతుబీ మా, పంట నష్టపరిహారాలు తీసుకునే విషయంలో రైతుల మధ్య గొడవలు జరుగుతయి. రైతుల మధ్య కొట్లాటలు తేవాలని కాంగ్రెసోళ్లు చూస్తున్నరు. పట్టాదారు తన భూమిని కౌలుకు ఇస్తే ఇప్పుడు ఎలాంటి నష్టం లేదు. కౌలుదారుకు హక్కులు ఇస్తమంటే పట్టాదారు భూమి ఇయ్యడు. కౌలు చేసుకునే రైతులే ఆగమైతరు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో తిప్పలు పడి రైతుబంధు, రైతుబీమా, ఎకరాకు రూ.10వేలు పంట నష్టపరిహారం ఇవ్వడంతోపాటు ఉచితంగా 24గంటల కరెంట్, కాళేశ్వరంతో కావాల్సినంత సాగునీరు అందిస్తున్నరు. కాంగ్రెసోళ్లు రైతులకు చేసిందేంటో అందరికీ తెలుసు. రైతులను ఆగం చేసే పనులే తప్ప రైతులను బాగుచేసిందిలేదు. రైతులంతా బీఆర్ఎస్ను బలపర్చాలె. బీఆర్ఎస్ సర్కారుతోనే రైతులకు మేలు జరుగతది.
న్యూశాయంపేట : ధరణితో భూ సమస్యలు లేకుండా అయ్యాయి. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ నిమిషాల్లో పూర్తవుతుంది. పారదర్శకంగా సేవలు అందు తున్నాయి. రైతులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి చేసి పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందుతు న్నాయి. సమయం వృథా కాదు. ఎవరి చుట్టూ తిరిగే పని లేదు. ధరణి వచ్చాకే రైతుబంధు, రైతు బీమా వచ్చి అండ గా నిలుస్తున్నాయి. భూమిని అమ్మలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలగిపోయాయి. ఎలాంటి పైరవీలు లేకుండా అల్కగ పనులవుతానయి.