న్యూశాయంపేట, అక్టోబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాదరణ ఉందని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ గెలుపు కోసం గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలో కార్పొరేటర్ మామిం డ్ల రాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే నాయకుడు దాస్యం వినయ్భాస్కర్ అని అన్నారు. తొమ్మిదేండ్లలో వరంగల్ పశ్చిమలో రూ.5వేల కోట్ల అభివృద్ధి పనులు చేశారన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల ఇన్చార్జి జోరిక రమేశ్, మాజీ కార్పొరేటర్లు మాడిశెట్టి శివశంకర్, వేల్పుల మోహన్రావు, డివిజన్ అధ్యక్షుడు ఆలకుంట్ల వెంకన్న, డివిజన్ మాజీ అధ్యక్షుడు వేల్పుల వేణుగోపాల్, యూత్ అధ్యక్షుడు ఆదె ఉమేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జానకీరాములు, గుండు సదానందం పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : వినయ్ భాసర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కన్వీనర్ పులి రజినీకాంత్ పిలుపునిచ్చారు. 10వ డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. మచిలీబజార్, నబీఖాన గల్లి, బొందివాడతో పాటు పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు ఈశ్వర్, హరికృష్ణ, సుధాకర్, గోపి, రామకృష్ణ, కృష్ణ, బజరుద్దీన్, ప్రమీల, నజియా పాల్గొన్నారు.
గిర్మాజీపేట : 29వ డివిజన్లో నియోజకవర్గ కోఆర్డినేటర్, ఇన్చార్జి నార్లగిరి రమేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కడకండ్ల సదాంత్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోలోని అంశాలను గడపగడపకూ వివరించారు. కార్యక్రమంలో రుద్ర శ్రీనివాస్, ఇజ్జగిరి భీమరాజ్, గొర్రె కుమార్, మంద చంటి, మైదం కరుణాకర్, బిస్పాక శివకుమార్, వరుణ్, వెంకట ప్రసాద్, ముత్యాల మహేందర్, మట్టెవాడ సారంగం, కోరె రమ్య, గొర్రె అరుణ్, మిద్దపాక ఆనంద్ పాల్గొన్నారు.
కాజీపేట : కాజీపేటలోని 47, 48, 62 డివిజన్లలో పార్టీ సీనియర్లు గబ్బెట శ్రీనివాస్, మర్యాల కృష్ణ, హరినాధ్, అంబాల రమేశ్, సుంచు రఘురాం, ఫర్హాన్తో పాటు బూత్ కమిటీ ఆధ్వర్యం లో బాపూజీనగర్, బూడిదగడ్డ, రహమత్ నగర్, విష్ణుపురి, సోమిడి, గాంధీనగర్ ప్రాంతాల్లోప్రచారం చేపట్టారు. కార్పొరేటర్ సంకు నర్సింగరావు, భవన నిర్మాణ రంగాల కార్మిక రాష్ట్ర నాయకుడు తేలు సారంగపాణి, ఇన్చార్జీలు సుంచు కృష్ణ, శిరుమల్ల దశరథం, డివిజన్ల అధ్యక్షులు దువ్వ కనకరాజు, హరినాథ్, పాలడుగుల శివకుమార్, సీనియర్ నాయకులు రామస్వామి, భిక్షపతి, శంకర్, పోతుల సాంబయ్య, శ్రీకాంత్, యాదగిరి, ఉప్పల్రావు, నర్సింగ్రావు, రాజేందర్, రాజ్కుమార్, హకీం, షుకూర్, ఇమ్రాన్, చాణక్య, ఎనుగందుల మాలతి, రేణుక, నాయిని విజయ, పాలడుగుల అనిత, రాంచందర్, కాంపెల్లి లక్ష్మణ్, గబ్బెట సిద్ధు, రోహిత్ పాల్గొన్నారు.