గీసుగొండ : మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సఖీ కేంద్రం సమాజిక కార్యకర్త సుధ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు గృహహింస వేధింపులు, లైగింక వేధింపులతో పాటు మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలతో మహిళలు నిత్యం వేధింపులకు గురవుతున్నన్నారని ఆమె తెలిపారు.
మహిళల కోసం సఖీ కేంద్రం ద్వారా ఎంతో మంది మహిళలకు స్త్రీల హక్కులపై అవగాహన కల్పించామన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా100,181 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. సఖీ కేంద్రం 24 గంటల పాటు పని చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సఖీ సిబ్బంది నిర్మలాదేవి, సీసీ జనార్ధన్, మహిళలు పాల్గొన్నారు.