శాయంపేట, జూన్ 17: గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సూర్యనాయక్తండాలో శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించి తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేశారని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ 10శాతం పెంచి గిరిజనుల బతుకుల్లో సీఎం వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతికగా రూ.45కోట్లతో హైదరాబాద్లో సంత్ సేవాలాల్, కుమ్రంభీం భవనాలను నిర్మించినట్లు తెలిపారు.
గిరిజనులు, ఆదివాసులు ఆరాధించే సంత్ సేవాలాల్, నాగోబా, మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని పేరొన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని పేరొన్నారు. 29 మందికి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఎంపీడీవో అమ్మంచ కృష్ణమూర్తి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంశెట్టి లతా లక్ష్మిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, సర్పంచ్ భూక్య రమేశ్, మండల వైద్యాధికారి సాయికృష్ణ, హెచ్ఈవో వెంకటేశ్వర్లు, హెచ్ఏ చలపతి, సుమన్ పాల్గొన్నారు.
తండాలను జీపీలు చేసిన సీఎం కేసీఆర్
హసన్పర్తి: తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులను గుర్తించింది సీఎం కేసీఆర్ అని ఎంపీపీ కేతపాక సునీత అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని హరిశ్చంద్రనాయక్ తండాలో సర్పంచ్ నునావత్ ఐలమ్మా మొగిలి అధ్యక్షతన శనివారం గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ గిరిజనులకు ప్రత్యేక గురింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం గిరిజనులు సంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేశారు. ఎంపీడీవో రామకృష్ణ, జడ్పీటీసీ రేనుకుంట్ల సునీత, ఎంపీవో రవిబాబు, సూపరింటెండెంట్ సునిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, ఎంపీటీసీ మంజుల-కుమార్, మార్కెట్ డైరెక్టర్ నునావత్ రాజు, ఏఈ అంజా, గ్రామ సెక్రటరీ రత్నాకర్రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
వర్ధన్నపేట: గ్రామాల సంపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట జడ్పీటీసీ మార్గం భిక్షపతి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని చంద్రుతండాలో నిర్వహించిన గిరిజనోత్సవంలో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతం ఆయన మాట్లాడుతూ గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని సీఎం కేసీఆర్ గూడెంలు, తండాలను జీపీలుగా ఏర్పాటు చేశారని లిపారు. వారే పాలించుకోవడంతో త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నేరుగా వాటికే నిధులను మంజూరు చేయడంతోపాటుగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నదని వివరించారు. తండాలో గిరిజన ఉత్సవాలకు వచ్చి ప్రముఖులకు ఘనంగా స్వాగతం పలికారు. సర్పంచ్ మాలోత్ స్వరూప, ఎంపీటీసీ అనసూయ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, నాయకులు తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రాయపర్తి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని గిరిజన జీపీలతోపాటు గ్రామాల్లో తెలంగాణ గిరిజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గిరిజనుల ఆరాధ్య దైవం సంతుసేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి బోగ్ భండార్ నిర్వహించారు. తండాలను జీపీలు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండలంలో జీపీలు చేసిన గిరిజన గ్రామాలు గణేశ్కుంట తండా, దుబ్బతండా, ఏకే తండా, సూర్యతండా, పానీష్తండా, బాలాజీ తండా, జేతురాంతండా, జింకురాంతండా, ఎర్రకుంట తండా, జయరాంతండ(కె), పన్యానాయక్తండా, జయరాంతండా(ఎస్), బాలునాయక్తండాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, మండల నాయకులు పూస మధు, సర్పంచ్లు మునావత్ సుజాత, దేదావత్ కమల వెంకన్న, కునుసోతు సరిత సజ్జన్నాయక్, పరుపాటి రవీందర్రెడ్డి, దేదావత్ జగన్నాయక్, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, కుందూరు రామ్చంద్రారెడ్డి, గట్టు నర్సింహాచార్యులు పాల్గొన్నారు.