పోచమ్మమైదాన్ : వరంగల్ ఎల్బీ నగర్ పద్మశాలీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. కొవిడ్-19 టీకాలు అర్హులైనవారికందరికీ అందే విధంగా చూడాలని సూచించారు. అలాగే వైద్యపరంగా అవసరమైన అన్నిరకాల మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాశ్, మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, ఏఎన్ఎం అరుణ, సులోచన, లావణ్య, రేణుక, రమ, రబ్బాని, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అలాగే దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తంగెళ్లపల్లి భరత్కుమార్, సిబ్బంది జన్ను కోర్నెలు, సరస్వతి, అనిల్, కుమార్, నిహారిక పాల్గొన్నారు. 22వ డివిజన్ ఇన్నర్వీల్ కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమారస్వామి, మెడికల్ ఆఫీసర్ భరత్కుమార్ ప్రారంభించారు.