జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : భారత దేశ కీర్తి దశదిశలా చాటేలా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు అనురాగ్శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, ఎస్పీ సురేందర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనురాగ్శర్మ మాట్లాడారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భారత వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రగతి ని వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రతి దళిత కటుంబానికి దళిత బంధు కింద రూ.10 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు. 151 యూనిట్లు మంజూరు చేసి రూ.12.79 కోట్లు కోటాయించినట్లు వివరించారు.
వ్యవసాయానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,220 మంది రైతులకు రైతు బీమా పథకం కింద రూ.61 కోట్లు అందించినట్లు చెప్పారు. గొర్రెల అభివృద్ధి పథకంలో భాగంగా గొల్ల కురుమలకు మొదటి, రెండో విడుతలో 6,923 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
మిషన్ భగీరథ పథకంలో 1,508 కిలో మీటర్ల పైపులైన్లు వేసి 124 గ్రామాల్లోని లక్షా 3వేల నివాసాలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్, 100 యూనిట్ల లోపు ఎస్సీ, ఎస్టీలకు, 250 యూనిట్ల లోపు 849 సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు వివరించారు.
పల్లె, పట్టణ ప్రగతితో భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు గ్రామాలు ప్రగతి పరుగులు పెగుతున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో రూ.76 కోట్లతో 689 పనులను ప్రారంభించగా ఇప్పటి వరకు రూ.64.88 కోట్లు ఖర్చు చేసి 646 పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.కోటితో డంపింగ్ యార్డ్, రూ.40 లక్షలతో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రూ. 25 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. 1,643 మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రూ.కోటీ 64లక్షల రుణాలు, శ్రీనిధి ద్వారా 1,650 సంఘాలకు రూ. 24 కోట్ల రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా 4,565 సంఘాలకు రూ.188 కోట్ల రుణాలు అందించినట్లు చెప్పారు. పాడి పశువుల కొనుగోలుకు 119 మంది మహిళలకు స్త్రీ నిధి ద్వారా రూ.కోటి, సీఎం గిరివికాసం పథకంలో 334 బోరు బావులు మంజూరు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 49,282 మందికి ప్రతి నెల రూ.11 కోట్లను అందిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో 11,857 కొత్త పింఛన్లు అందించనున్నట్లు అనురాగ్శర్మ తెలిపారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.2.46 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పా రు. జిల్లాలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకంలో 3,664 మంది లబ్ధిదారులకు రూ.42.50 కోట్లు, 84 మందికి షాదీముబారక్ కింద రూ.84.34 లక్షలుఅందించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, మన ఊరు-మన బడి పథకంలో జిల్లాలోని 149 పాఠశాలలను రూ.26 కోట్లతో అభివృద్ధి చేస్తునట్లు తెలిపారు.