భూపాలపల్లి రూరల్, జూలై 17: జిల్లా కేంద్రంలో ఆదివారం నీట్ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో అర్హత పరీక్షను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు నిర్వహించారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జిల్లాకో పరీక్ష కేంద్రాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఏర్పాటు చేశారు. జిల్లా మాంటిస్సోరి పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా, 318 విద్యార్థులకు 309 మంది హాజరయ్యారు. కోఆర్డినేటర్ సెయింట్ ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే విద్యార్థులను చెక్ చేసి కేంద్రాల్లోకి పంపారు. డీఈవో కార్యాలయం నుంచి అబ్జర్వర్గా బానోత్ జుమ్మునాయక్ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించారు.