వరంగల్, ఆగస్టు 15 : జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్క రించుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్విసప్తాహం పేరిట సోమవారం స్వాతంత్య్ర వేడులకను ఘనంగా నిర్వహించారు. బల్దియా కార్యాలయంలో స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ సుధారాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
స్వాతంత్య్ర సిద్దించి 75 ఏం డ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ ద్వీసప్తాహ వేడుకలను ప్రభుత్వం అంబరాన్నంటేలా సంబురాలు చేస్తున్నదన్నారు. ఆగస్టు 8 నుంచి 22 వరకు గ్రేటర్ పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూన్నామన్నారు. నగరంలో కోటి 20 లక్షల జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తి తో వరంగల్ నగరాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు.
సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. చారిత్రక వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో ముందు నిలుతామన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ, మరుపల్ల రవి, బస్వరాజ్ శీరీష, పల్లం పద్మ,ఆదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, సిటీ ప్లానర్ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, బల్దియా ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు గౌరిశంకర్, వింగ్ అధికారులు పాల్గొన్నారు.
పబ్లిక్గార్డెన్లోని టౌన్హాల్లో స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
హనుమకొండ సిటీ: బాలసముద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు ఆఫీస్లో ప్రభుత్వ చీప్విప్ దాస్యం వినయ్భాస్కర్ జెండావిష్కరించారు. ఎమ్మెల్యే సతీమణి రేవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, నయీమోద్దీన్, రహిమున్నిసాబేగం పాల్గొన్నారు.
కాజీపేట: కాజీపేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, రైల్వే జంక్షన్, పరిసర ప్రాంతాల్లోని పలు కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనుభావుల త్యాగ ఫలితంగా నేటి స్వాతంత్య్ర వేడుకలన్నారు.
ఈ కార్యక్రమం లో ఆర్టీఏ మెంబర్, జిల్లా జీపు, తుఫాన్ యూనియన్ అధ్యక్షుడు కాటాపురం రాజు, నాయిని వేణుగోపాల్, నర్సన్న, రాజ్కుమార్, శంకర్, రాజు, టీఆర్ఎస్ నాయకులు సుంచు క్రిష్ణ, రఘు, కుమ్మరి రాజ్కుమార్ నాయకులు పాల్గొన్నారు. కాజీపేట పట్టణం 47వ డివిజన్లోని బాపూజీనగర్లో సిద్ధు టెంట్ హౌస్ వద్ద టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్టెట శ్రీనివాస్, మర్యాల కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నార్లగిరి రమేశ్ పాల్గొని జాతీయ జెం డాలను ఆవిష్కరించారు.
61వ డివిజన్ ప్రశాంత్నగ వందఫీట్ల రోడ్డులో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోట్టే పుల్లయ్య అధ్యక్షతన జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవంలో కార్పొరేటర్ ఎలకంటి రాములు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాజీపేట పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తహసీల్దార్ కిరణ్కుమార్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి, కాజీపేట రైల్వే జంక్షన్లోని జీఆర్ఫీలో సీఐ రాం మూర్తి, ఎస్సై అశోక్కుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమంలో రైల్వే డీఈఈ స య్యద్ వాసీం పాషా, డీఎంఈ హనుమా నాయక్ డీఎంఈ, ఏడీఎంఈలు భాను ప్రసాద్, రాజశేఖర్, పాపారావులో పాటుగా రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, జా యింట్ సెక్రటరీ రాజయ్య, కోశాధికారి గిరిమిట్ల రాజేశ్వర్రావు, కమిటీ సభ్యులు రవికిరణ్, ప్రవీ ణ్, ప్రశాంత్, మాధవరావు, ప్రశాంత్కుమార్, రఘు, రైల్వే మజ్ధూర్ యూనియన్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ నాయకులు సదానందం, వీరన్న, ఆర్ రమేశ్, జిలానీ, లావణ్య, రాధిక పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ: కలెక్టర్ కార్యాలయలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి జాతీయ జెండాను ఆవిషరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు, నిరంతరం ప్రజల్లో అవగాహన పెంచేందుకు చైతన్యపరచడంలో ముందుండి పని చేస్తున్న పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, డీఆర్డివో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, డీడీ డీటీవో రాజు, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ ప్రకాశ్, ఐడీవోసీలో అన్ని శాఖలు సిబ్బంది పాల్గొన్నారు.
నయీంనగర్: ఫాతిమానగర్లోని మెలుహ రైసిం గ్ సన్ స్కూల్ల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఏం శ్రీనివాస్రావు ముఖ్యఅతిథిగా జెండాను ఆవిష్కరించారు. డీన్ పెద్దన్న, సంద్య, శాంతికిరణ్, రాజు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
న్యూశాయంపేట : గ్రేటర్ 31వ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం స్వామి ఆధ్వర్యం లో కార్పొరేటర్ మామిండ్ల రాజు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెక్ జోనల్ టీ సుభ్రమణ్యం, ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, కోశాధికారి మార్త రాంప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రేటర్ 49వ డివిజన్లో కార్పొరేటర్ ఏనుగుల మానసారాంప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. న్యూశాయంపేట లోని సూర్జీత్నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆలకుంట్ల వెంకన్న, అదె ఉమేశ్, ఉష తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ: అమరుల పోరాట ఫలితమే నేడు దేశ ప్రజలంతా స్వాతంత్య్ర ఫలాలు పొందుతున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం నక్కలగుట్టలోని విద్యుత్భవన్లో సీఎండీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. డైరెక్టర్స్ బీ వెంకటేశ్వర్రావు, పీ గణపతి, పీ సంధ్యారాణి, పీ మోహన్రెడ్డి, ఇన్చార్జి డైరెక్టర్ వీ తిరుపతి, సీజీఎంలు అశోక్కుమార్, సదర్లాల్, మోహన్రావు, కిషన్, ఏఎన్ గుట్ట, రాజుచౌహాన్, భీకంసింగ్, రవీంద్రనాథ్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్, విజిలెన్స్ సీఐ శ్రీలక్ష్మి, ఉద్యోగులు పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ : టీఎన్జీవోస్ భవన్లో యూ నియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిషరించారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రాంకిషన్, హనుమకొండ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, కేంద్ర సంఘ నాయకులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, రాము నాయక్, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్రావు, వరంగల్ జిల్లా కార్యదర్శి గాజే వేణుగోపాల్, జిల్లా నాయకులు సలీం, మోయిస్, చీకటి శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ: ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సుబేదారిలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య జాతీయ జెండాను ఆవిషరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హనుమంతు, కిష్టయ్య పాల్గొన్నారు.
సుబేదారి: హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. సీపీ తరుణ్జోషి జాతీయ జెండాను ఎగురవేశారు. డీసీపీలు వెంటక లక్ష్మి, అశోక్కుమార్, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
సుబేదారి: సర్కూట్ గెస్ట్ రోడ్డులో డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు, ముస్లిం చిన్నారులు, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోన శ్రీకర్, విజయకుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ అదాలత్ డీసీసీ బ్యాంకులో చైర్మ న్ రవీందర్రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. బ్యాంకు సీఈవో చిన్నరావు, ఉద్యోగులు, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.
హనుమకొండ సుబేదారిలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ కార్యాలయంలో స్వా తంత్య్ర వేడుకలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జి, అడిషనల్ డీసీ పీ గైక్వాడ్ వైభవ్ జాతీయ జెండాను ఎగురవేశా రు. ఏసీపీ జితేందర్రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, నరేశ్ కుమార్, ఎస్సై లవన్కుమార్ పాల్గొన్నారు.
నయీంనగర్: కాకతీయ యూనివర్సిటీలో స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేయూ వీసీ రమేశ్ ము ఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి, మదన్ కుమార్, నాగేంద్రబాబు, మల్లారెడ్డి, మనోహర్, సుమతి, ఉమా మహేశ్వరి, శ్రీనివాస్రావు, దీపాజ్యోతి, పృథ్వీరాజ్, శివ కుమార్ పాల్గొన్నారు.
మడికొండ : మడికొండ పోలీస్ స్టేషన్లో ఎస్సై నర్సింగరావు, మహిళా ప్రాంగణంలో మేనే జర్ జయశ్రీ జాతీయ జెండాలను ఎగురవేశారు. అలా గేమన తెలంగాణ ఆటోడ్రైవర్ యూనియన్ అడ్డా, 46, 63 డివిజన్లో కార్పొరేటర్లు ఆవాల రాధికరెడ్డి, మునిగాల సరోజన జాతీయ జెండా లను ఎ గురవేశారు. ఏకశిల హైస్కూల్లో ప్రిన్సిపాల్ భర త్ కుమార్ జాతీయ జెండాలను ఎగురవేశారు.