ఖిలావరంగల్, ఫిబ్రవరి 3 : పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, అందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో శనివారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను సబ్జెక్టుల వారీగా వార్షిక పరీక్షలకు సంసిద్ధులను చేయాలన్నారు. 2022-23లో పదో తరగతిలో జిల్లా 92 శాతం ఉత్తీర్ణత సాధించిందని, ఈ ఏడాది వందశాతం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గత ఏడాది ఖిలావరంగల్, గీసుకొండ, నర్సంపేట మండలాల్లో తకువ ఉత్తీర్ణత నమోదైనట్లు గుర్తుచేశారు.
ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందించాలని డీఈవో వాసంతిని ఆదేశించారు. అనంతరం వీర్ గాథా విజేత కీర్తిప్రసన్న, గైడ్ టీచర్ కే మాధవిని కలెక్టర్ సత్కరించారు. అనంతరం విద్యార్థుల మోడల్ పర్యావరణ జిల్లా పరిషత్ నిర్వహణ కరపత్రాలను ఆమె ఆవిషరించారు. మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో పారిశుధ్యం, రవాణా, ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు సత్యనారాయణ, రంగ య్య, విజయ్కుమార్, రత్నమాల, డీఎస్వో శ్రీనివాస్, ఏఎంవో సారయ్య, కోఆర్డినేటర్ సుధీర్బాబు, వీర్ గాథా నోడల్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా రిసోర్స్పర్సన్ బాలాజీరావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీఎంఎలపై జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల పిటిషన్ కాలం గత నెల 17తో ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు లోకసభ ఎన్నికలకు ఉపయోగించేందుకు సోమవారం తెరుస్తామని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కావాలని కోరారు.
జిల్లాలో వచ్చే వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులు నీటి శుద్ధి నుంచి మొదలుకొని ఇంటింటికీ చేరే వరకూ ఎలాంటి సమస్య ఉందో పరిశీలించాలన్నారు. సమస్యలపై సమగ్ర నివేదిక అందించాలని సూచించారు.
కలెక్టరేట్లో సోమవారం జరిగే గ్రీవెన్స్ను పరిపాలనా పరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఫిర్యాదులు అందించేందుకు కార్యాలయానికి రావొద్దని కోరారు.