ఖిలావరంగల్, జూన్ 2: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ని ర్వహణ సందర్భంగా నియమించిన అధికారులు తమ విధులపై అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూ ప్-1 పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24 కేంద్రాల్లో గ్రూప్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు.
పరీక్ష రాసే 9716 మంది అభ్యర్థులు ఉదయం 10.15 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. లైజనింగ్ అధికారులుగా 24 మంది, రూట్ ఆఫీసర్లుగా ఆరుగురిని నియమించామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, ఆర్డీవో మహేందర్జీ పాల్గొన్నారు.