లింగాల గణపురం : జనగామ జిల్లా సూర్యాపేట -జనగామ జాతీయ రహదారిపై నెల్లుట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లింగాల గణపురం మండలంలోని బండ్లగూడ కు చెందిన గీత కార్మికుడు బండి రాంనర్సయ్య తన మోపైడ్పై వెళుతూ నెల్లుట్ల వద్ద డివైడర్ను దాటుతుండగా..జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో బండి రామ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మల్లమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.