హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో వందలాది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు.
ఇటీవలే నాగర్కర్నూల్ సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్ధినులు ఆందోళన బాట పట్టారు. కలుషిత ఆహారం పెడుతున్నారని ఆరోపిస్తూ తరగతులు బహిష్కరించి రోడ్డెక్కారు. మంచి ఆహారం పెట్టి, కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.
కలుషిత ఆహారం పెడుతున్నారని తరగతులు బహిష్కరించి రోడ్డెక్కిన విద్యార్థినులు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్ధినుల ఆందోళన
మంచి ఆహారం పెట్టి, కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన… pic.twitter.com/jfe0QBX3tT
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2026