హనుమకొండ చౌరస్తా, జూలై 10 : హనుమకొండలోని జూనియర్ కాలేజీ జంక్షన్లో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని పిడిఎస్యు, డిఎస్ఎ, టిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్లో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు దుర్గం సారయ్య, కామగోని శ్రావణ్, జె.భారత్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియచేస్తున్న విద్యార్థి సంఘ నాయకుల అక్రమ అరెస్టులను వారు ఖండించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఇచ్చిన బంద్ విజయవంతమైం దన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, క్రాంతి, జాషువా, సంపత్, చరణ్,కమల్, హరీష్ పాల్గొన్నారు.