బచ్చన్నపేట, మార్చి 11 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు నరసింహ స్వామి అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ నీల కవిత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో స్కూల్ టాపర్ కి 2000 రూపాయలు మండల టాపర్కు 5000 రూపాయలు, జిల్లా టాపర్ కి 10000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు.
మంచి రిజల్ట్స్ సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్యాడులను బహుకరించారు. ఈ సమావేశంలో ఏఏపీసీ చైర్మన్ కొత్త పల్లి అంజమ్మ, ఉపాధ్యాయులు యాదగిరి, ఎస్ కిషన్, మహమ్మద్ అoకుషావలి, వి రఘుమూర్తి, ఏ ప్రభాకర్ పాల్గొన్నారు.